గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడ లో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైద్రాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీ… లో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిచింది జీహెచ్ఎంసీ. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించింది జీహెచ్ఎంసీ.
Also Read
ఒక్కో డబుల్ బెడ్ రూమ్ 560 చదరపు అడుగుల విస్తీర్ణంగా ఉండగా…. మౌలిక సదుపాయాల కల్పనతో కలిపి ఒక్కొక్క డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రూ. 8.65 లక్షల వ్యయంతో నిర్మించారు. అలాగే… సిసి రోడ్లు, సీవరేజ్ లైన్లు, త్రాగునీటి కై సంపు నిర్మాణం, ఐదు లిఫ్ట్ ల ఏర్పాటు, విద్యుదీకరణ లను చేపట్టారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ల నిర్వహణకు గాను 19 దుకాణాలు నిర్మించారు. చంచల్ గూడ ప్రధాన జంక్షన్ లో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మార్కెట్ లో ఒక్కొక్కటి కనీసం రూ. 40 లక్షలకు పైగానే ఉంటుంది. అయితే… ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవాళ ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..