Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై చిన్నచిన్న ఇబ్బందులు వాస్తవమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా ఉత్సవాల సందర్భంగా గతంలో లేని విధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. భక్తుల తాకిడి నేపథ్యంలో వీఐపీల దర్శనాల విషయంలో గందరగోళం ఏర్పడింది. మూలా నక్షత్రం సందర్భంగా నిన్న రికార్డ్ స్థాయిలో భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారన్నారు దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ. కొండపైన ఆలయంలో చిన్న చిన్న ఇబ్బందులు జరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అంచనాకి మించి భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారన్నారు. చివరి వ్యక్తికి కూడా దర్శన భాగ్యం కల్పించామన్నారు మంత్రి.
వృద్దులు,వికలాంగులకు కేటాయించిన టైం స్లాట్ లో మాత్రమే రావాలి.. మామూలు సమయంలో వచ్చి ఇబ్బంది పడవద్దు. ఈసారి తెప్పోత్సవానికి ఇంకా ఇరిగేషన్ నుంచి అనుమతి రాలేదు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే హంస వాహనాన్ని ఒకచోటే నిలిపి ఉత్సవాన్ని నిర్వహిస్తాము. ఇప్పటివరకు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. రేపు ఎల్లుండి భవానీ మాల ధారణ వేసిన భక్తులు ఎక్కువగా వస్తారు. వారికి తగ్గట్టుగా ప్రసాదాలు కూడా ఎక్కువగా సిద్ధం చేస్తున్నాం అని మంత్రి తెలిపారు. దసరా రోజున దుర్గమ్మ తెప్పోత్సవం రద్దయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ కి విడుదల అయింది. సాధారణంగా 30వేల క్యూ సెక్కుల లోపు ఇన్ ఫ్లో ఉంటేనే జల వనరుల శాఖ దుర్గమ్మ తెప్పోత్సవం కార్యక్రమానికి అనుమతి ఇస్తుంది. ఇవాళ సాయంత్రం జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. గడచిన ఏడాది వరదల కారణంగా వేద పండితులను మాత్రమే అనుమతించిన అధికారులు..ఈ సారి ఏంచేయాలనేదానిపై కాసేపట్లో తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా దుర్గమ్మ తెప్పోత్సవం కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు.
Read Also: Devaragattu Bunny Festival: దేవరగట్టు కర్రల సమరానికి అంతా సిద్ధం
ఇంద్రకీలాద్రిపై దర్శనాల రచ్చ
పోలీసుల వ్యవహార శైలిపై ఈవో సీరియస్ అయ్యారు. రంగంలోకి దిగి వీఐపీ ఎంట్రీ పాయింట్ దగ్గర కూర్చున్నారు ఈవో. వీఐపీ తరహాలో నేరుగా దర్శనాలకు వెళుతున్న పోలీసు కుటుంబాల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నో టికెట్స్ , నో క్యూలైన్స్ , నోరూల్స్ అంటూ పోలీసు కుటుంబాల వారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. డ్యూటీ పేరుతో దర్శనాలకు కుటుంబాలతో క్యూ కడుతున్నారు పోలీసులు. గంటల తరబడి క్యూలైన్స్ లో భక్తులు కిటకిట లాడుతుంటే.. ఇలా అడ్డదారిలో దర్శనాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.500 టికెట్ కొన్న భక్తులకు సైతం వెయిటింగ్ తప్పడం లేదు. ప్రోటోకాల్ వుండి మేమే క్యూ లైన్ లో వెళ్తుంటే పోలీసులు నేరుగా ఎలా వెళ్తారంటూ మండిపడుతున్నారు భక్తులు. రాజ మార్గంలో నిమిషాల్లో తమ కుటుంబ సభ్యులకు దర్శనాలు ఇప్పిస్తున్న పోలీసుల తీరుపై అధికారులు నోరుమెదపడం లేదు.
Read Also: Svante Paabo: వైద్యశాస్త్రంలో పాబోకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..