Kottu Satyanarayana: ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు..? ఎన్నికల్లో పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.. జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర చూసి ఎలాగూ బీహార్ లో ఉన్నానని ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్ర చేశారు.. ఆ అనుభవం ఆయనకే తెలయాలి.. దగుల్ బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ పై చేసిన కామెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Read Also: Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ప్రశాంత్ కిషోర్ ఎంత మందికి సలహాలు ఇచ్చాడు.. ఎన్ని చోట్ల ఓడిపోయింది అనేది సమాధానం చెప్తాడా అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ని ఎన్నో మాటలని బీహార్ పోటుగాడు వచ్చాడని ఇప్పుడు ఏమి అవసరం వచ్చి కాళ్లు పట్టుకొని తీసుకొచ్చారు.. వాళ్లే సమాధానం చెప్పాలి.. ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉంటారు..? మేము గేట్లు తెరిస్తే సగం సీట్లకు పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు. జనసేన గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాపు సామాజిక వర్గం తలదించేలా చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు.. కోర్టు రిమాండ్ చేసి జైల్లో పెడితే సాష్టాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తా అన్నాడు.. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని సమర్థించలేదు.. కాపు నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ ఖండించలేదు.. చంద్రబాబు ద్వారా కాపులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపలేదు, కాపులకు నాయకత్వం వహిస్తున్నా అనే అర్హత కూడా పవన్ కు లేదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!