Kottu Satyanarayana: ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు..? ఎన్నికల్లో పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు.. జగన్ లాంటి పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేసేవాన్ని వదిలేసి చంద్రబాబు లాంటి దుర్మార్గున్ని తెచ్చుకొని కొరివితో తల గోక్కుంటామా అని ప్రజలే అంటున్నారు.. ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీ పెట్టాలని ఆశ ఉంది.. బీజేపీని ఓడించడానికి దేశంలోని నాయకుల అందరిని అనుసంధానం చేశాడు.. అది బెడీసీ కొట్టింది అని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర చూసి ఎలాగూ బీహార్ లో ఉన్నానని ప్రశాంత్ కిషోర్ కూడా పాదయాత్ర చేశారు.. ఆ అనుభవం ఆయనకే తెలయాలి.. దగుల్ బాజీ రాజకీయాలు చేసిన చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ పై చేసిన కామెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Read Also: Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ప్రశాంత్ కిషోర్ ఎంత మందికి సలహాలు ఇచ్చాడు.. ఎన్ని చోట్ల ఓడిపోయింది అనేది సమాధానం చెప్తాడా అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ని ఎన్నో మాటలని బీహార్ పోటుగాడు వచ్చాడని ఇప్పుడు ఏమి అవసరం వచ్చి కాళ్లు పట్టుకొని తీసుకొచ్చారు.. వాళ్లే సమాధానం చెప్పాలి.. ఏ వైసీపీ ఎమ్మెల్యే టచ్ లో ఉంటారు..? మేము గేట్లు తెరిస్తే సగం సీట్లకు పోటీకి టీడీపీకి అభ్యర్థులు లేరు అని ఆయన విమర్శలు గుప్పించారు. జనసేన గురించి ఎంత చెప్పినా తక్కువే.. కాపు సామాజిక వర్గం తలదించేలా చంద్రబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు.. కోర్టు రిమాండ్ చేసి జైల్లో పెడితే సాష్టాంగ నమస్కారం చేసి జీవితాంతం చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తా అన్నాడు.. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని సమర్థించలేదు.. కాపు నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఎప్పుడూ ఖండించలేదు.. చంద్రబాబు ద్వారా కాపులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపలేదు, కాపులకు నాయకత్వం వహిస్తున్నా అనే అర్హత కూడా పవన్ కు లేదు అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!