AP Assembly 2025: అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు: మంత్రి కొండపల్లి
- పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోంది
- ఇప్పటివరకు 14 వేల పెన్షన్లు తొలగించాము
- అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో పెన్షన్ లబ్దిదారుల వెరిఫికేషన్ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు.
‘2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించాము. అందులో 10,791 శాశ్వత వలస దారులు కాగా.. 4,176 మంది అనర్హులు. పెన్షన్లను తొలగిస్తున్నట్లు ఏవేవో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి పెన్షన్లు తీయడం జరగలేదు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోంది. అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Also Read
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై బుచ్చయ్య చౌదరి, కూన రవికుమార్ ప్రశ్నించారు. ‘కాకినాడ పోర్టు అడ్డాగా విదేశాలకు, రీ సైక్లింగ్ కోసం బియ్యం వెళ్లిపోతోంది. బందరులో మాజీ మంత్రి, కుటుంబ సభ్యులు ఏం చేశారో అందరం చూశాం. బియ్యం సప్లైదారలు అక్కడే బియ్యం తీసుకొని అంతో, ఎంతో ఇచ్చి తీసేసుకునేవారు. వాహనాల ద్వారా కేంద్రీకృతం అయిన దోపిడీని చేశారు. బియ్యం అక్రమ రవాణా చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు బ్రతకాలి. లావోస్, అశోక ఇంటర్నేషనల్ కంపెనీలు ఎవరివో తేల్చాలి. దాదాపు 1000 కోట్లు అక్రమ బియ్యంలో దోచారు. దీనికి లాండ్ గ్రాబింగ్ నిరోధక చట్టం తరహాలో ఒక చట్టం తెచ్చి రాష్ట్ర ఖజానాకు దెబ్బకొడుతున్న వారిని శిక్షించాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!