Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
- ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా పోలేదు
- అల్లు అర్జున్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు
- రూ.20 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు రావద్దని చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్కు చెప్పారని, అయినా కూడా ఆయన వినకుండా వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా కూడా పోలేదని, పుష్ప 2 సినిమా చూసే వెళ్తా అని బన్నీ పట్టుపట్టాడన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమన్నారు. పుష్ప 2 సినిమాకు 2 వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని, బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి, సూపర్ స్టార్ అయితే ఏంటి అని మండిపడ్డారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ… ‘సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు. చిక్కడపల్లి ఏసీపీ రావద్దని చెప్పారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమంటే కూడా పోలేదు. సినిమా చూసే వెళ్తా అని అన్నాడు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపై అల్లు అర్జున్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. యాక్టర్ అయితే.. యాక్టింగ్ చేసుకో.మేం కూడా సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సహకరిస్తాం. సినిమా వారు అడిగారని టికెట్లు రేట్లు పెంచాం. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. హీరో అయినా, ఎమ్మెల్యేలు అయినా చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
Also Read: Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్కు అల్లు అర్జున్ రిక్వెస్ట్!
‘పుష్ప 2 సినిమాతో 2 వేల కోట్లు కలెక్షన్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారా? అని అడుగుతున్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితేనేంటి, సూపర్ స్టార్ అయితేనేంటి. బాధిత కుటుంబానికి రూ.20 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసుకున్నా.. మాకు సంబంధం లేదు. ఇకపై దేశభక్తి, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్ షోలకు అనుమని ఇస్తాం. సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రిగా చెబుతున్నా.. ఈ విషయంలో ఎవరు చెప్పినా తగ్గేదేలే’ అని మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!