Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి
- ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా పోలేదు
- అల్లు అర్జున్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు
- రూ.20 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు రావద్దని చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్కు చెప్పారని, అయినా కూడా ఆయన వినకుండా వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా కూడా పోలేదని, పుష్ప 2 సినిమా చూసే వెళ్తా అని బన్నీ పట్టుపట్టాడన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమన్నారు. పుష్ప 2 సినిమాకు 2 వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని, బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి, సూపర్ స్టార్ అయితే ఏంటి అని మండిపడ్డారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ… ‘సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు. చిక్కడపల్లి ఏసీపీ రావద్దని చెప్పారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమంటే కూడా పోలేదు. సినిమా చూసే వెళ్తా అని అన్నాడు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపై అల్లు అర్జున్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. యాక్టర్ అయితే.. యాక్టింగ్ చేసుకో.మేం కూడా సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సహకరిస్తాం. సినిమా వారు అడిగారని టికెట్లు రేట్లు పెంచాం. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. హీరో అయినా, ఎమ్మెల్యేలు అయినా చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Also Read: Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్కు అల్లు అర్జున్ రిక్వెస్ట్!
‘పుష్ప 2 సినిమాతో 2 వేల కోట్లు కలెక్షన్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారా? అని అడుగుతున్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితేనేంటి, సూపర్ స్టార్ అయితేనేంటి. బాధిత కుటుంబానికి రూ.20 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసుకున్నా.. మాకు సంబంధం లేదు. ఇకపై దేశభక్తి, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్ షోలకు అనుమని ఇస్తాం. సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రిగా చెబుతున్నా.. ఈ విషయంలో ఎవరు చెప్పినా తగ్గేదేలే’ అని మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!