Minister Kollu Ravindra: మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి.. రూ.32 వేల కోట్ల అప్పులు..!
- గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావెరి సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.. ఈ సమావేంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశాం.. కానీ, 2019- 24 మధ్య కాలంలో ఐదేళ్లు ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి.. మద్యం వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. కొత్త పాలసీ పేరుతో వ్యవస్థ మొత్తాన్ని విచ్చిన్నం చేశారు.రాష్ట్రంలోని డిస్టిలరీల నుండి మద్యం షాపుల వరకు మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. ఎన్ ఫోర్సు మెంట్ లేకుండా చేసి మద్యం అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి, తమ సొంత బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారు అంటూ విరుచుకుపడ్డారు..
Read Also: JR NTR : మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం కలిచివేసింది : జూనియర్ ఎన్టీఆర్
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక, గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం.. ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయి అన్నారు కొల్లు రవీంద్ర.. ఏపీలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా పెరిగింది.. సరిహద్దు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరగగా మన రాష్ట్రంలో మద్యం ఆదాయం తీవ్రంగా కోల్పోయాం. నాసిరకం సొంత బ్రాండ్ల కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడగా, పలువురు కిడ్నీ, లివర్ సమస్యల బారిన పడ్డారని విమర్శించారు.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ ద్వారా నాసిరకం బ్రాండ్లకు స్వస్తి పలకడం జరిగింది. 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టాం.. పాత బ్రాండ్లను తిరిగి పునరుద్ధరించాం. 350కి పైగా బ్రాండ్లు ఏపీలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు..
Read Also: Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్!
మద్యం ధరలను కూడా పొరుగు రాష్ట్రాలతో సమానంగా చేయడం వలన అక్రమ రవాణా ఆగింది అన్నారు కొల్లు రవీంద్ర. గతంలో ఉన్న బెల్టు షాపులపై కూడా చర్యలు తీసుకోవడంతో దాదాపు నిర్మూలించాం.. గత ఐదేళ్లు ఎక్సైజ్ శాఖను విచ్చిన్నం చేసి SEB ఏర్పాటుతో ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగా లేకుండా పోయింది. నవోదయం 2.0 ద్వారా సారా రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం అని వెల్లడించారు.. గంజాయి నిర్మూలన కోసం హోమ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసుకున్నాం.. టూరిజం పెంపు కోసం 3స్టార్ హోటల్ కి లైసెన్స్ ఫీజు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం.. గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారు.. గత ఐదేళ్ల అక్రమాల గురించి ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారు. క్యాష్ అండ్ క్యారీ.. విధానంతో దాదాపు లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోందన్నారు.. కానీ కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. మరోవైపు ఆన్ లైన్ ఇండెంట్, ట్రాక్ అండ్ ట్రేస్ విధానంతో పారదర్శకతకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
తాజావార్తలు
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!