Jogi Ramesh: సామాజిక న్యాయం.. జగన్ తోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సామాజిక న్యాయం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందన్నారు మంత్రి జోగి రమేష్. గతంలో అనేకమంది బలహీనవర్గాల వారు సీఎంలుగా చేశారు.. కానీ సామాజిక న్యాయం చేసింది మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి. బీసీ, ఎస్టీ, ఎస్సీలు మైనారిటీల మీద ప్రేమ ఉంటే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతున్నా.. 2014 నుంచి 2019 వరకూ సామాజిక న్యాయం ఏం చేశావు.. 2019 నుంచి 2023 వరకూ జగన్ హయాంలో సామాజిక న్యాయం ఏం జరిగిందో చర్చిద్దాం.. ఆ చర్చలోనే చంద్రబాబు బట్టలిప్పి పారిపోయేలా చేస్తాం అన్నారు మంత్రి జోగి రమేష్. బలహీనవర్గాల వారికి డీబీటీ ద్వారా 2 లక్షల కోట్లు వారి చెంతకు చేర్చాం.. చంద్రబాబు హయాంలో ఆయన తాబేదార్లకు న్యాయం జరిగింది. చీఫ్ మినిస్టర్ టు కామన్ మేన్ బటన్ నొక్కుతుంటే.. ప్రతి గడపగడపకు న్యాయం జరుగుతోంది. బీసీ మేధావులు, బీసీలలో ఉన్న ఉపాధ్యాయులు అన్ని వర్గాల వారు జగన్ పక్షాన అడుగులు వేయాలని మంత్రి జోగి రమేష్ కోరారు.
Read Also: Tipu Sultan Issue: టిప్పు పేరు వాడకండి.. చర్యలు తీసుకుంటామని వారసుల హెచ్చరిక
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
సామాజిక న్యాయం జగన్ తోనే సాధ్యం అన్నారు. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్మేసుకున్నారన్నారు. ఒక జాలరి చట్టసభకు వెళుతున్నారంటే, ఒక వడ్డీ కులస్తులు శాసనమండలికి వెళుతున్నాడంటే అదంతా జగన్ చలవే అన్నారు. ఇవాళ బీసీలు అందరూ తలెత్తుకుని తిరగగలుగుతున్నారు. జాతీయ పార్టీలు కూడా జగన్ మార్గంలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి జోగి రమేష్. గన్నవరం సంఘటన గురించి నాకు తెలియదు.. చూసిన తర్వాత స్పందిస్తానన్నారు జోగి రమేష్. శాసనమండలి ఎన్నికల్లో ఎస్.సి.ఎస్ టి…బి.సి లకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం. ఎమ్.ఎల్.ఏ.లు..ఇతర నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ప్రణాళిక రూపొందించాం. రేపు ఎం.ఎల్.సి.అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు.స్థానిక ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తాం అన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ముఖ్యమంత్రి జగన్ బీసీలకు పెద్దపీట వేశారన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చెప్పిన దాని కంటే బీసీలకు ఎక్కువ చేశారు.14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఒక్కరిని కూడా రాజ్యసభ కు పంపలేదు. భారతదేశం చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో చట్టసభల్లో అవకాశం ఇచ్చిన నాయకుడు లేడు. తన పాలనలో బీసీలకు చంద్రబాబు, నాలుగేళ్ళలో జగన్ ఏం చేశారో చర్చకు సిద్ధమా? చంద్రబాబు ఉండి ఉంటే ఇప్పుడు కౌంటర్ తెరిచి ఉండేవాడు. 18 మండలి స్థానాలను డబ్బులు ఇచ్చిన వారికి అమ్మి ఉండేవాడన్నారు మంత్రి కారుమూరి.
Read Also: India found deposit of lithium: బ్యాటరీలు, ఈవీ మార్కెట్లో ఇక మనదే హవా
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..