Minister Jogi Ramesh: ప్రజాయుద్ధంలో ఎవరూ జగన్ను ఓడించలేరు.. 20 ఏళ్లు జగన్ పాలనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: ప్రజాయుద్ధంలో ఎవరూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించలేరు.. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనే ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.. తాజాగా, వైసీపీ అధిష్టానం ఆయన్ని పెనమలూరు ఇంఛార్జ్గా నియమించడంతో.. ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పడమట సురేష్ నా తమ్ముడు.. నాతోనే వస్తాడు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, రాజశేఖరరెడ్డి అనుచరులు అందరూ మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉన్నారు.. వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటి పైకి వచ్చి పని చేస్తారు.. పార్థసారథి (సిట్టింగ్ ఎమ్మెల్యే) కూడా మనసులో జోగి రమేష్ గెలవాలనే కోరుకుంటాడు అని చెప్పుకొచ్చారు.
Read Also: Malla Reddy: పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా.. మల్లారెడ్డి మనసులోని మాట..
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
వచ్చే ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ జెండా ఎగరటం ఖాయం అన్నారు జోగి రమేష్.. ఇక, వైఎస్ షర్మిల.. చంద్రబాబును కలవటంలో తప్పేమీ లేదు అన్నారు. శుభకార్యానికి ఎవరినైనా పిలవచ్చు.. అందులో భాగంగానే చంద్రబాబును కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని షర్మిల ఆహ్వానించారని పేర్కొన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బలంగా ఉన్నాడు కనుకే అందరూ కలిసికట్టుగా వస్తున్నారు.. ప్రజా యుద్ధంలో ఎవరూ వైఎస్ జగన్ ను ఓడించ లేరు.. 20 ఏళ్ల పాటు జగన్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్. కాగా, పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ని వైసీపీ అధిష్టానం పెనమలూరు ఇంచార్జ్గా నియమించిన విషయం విదితమే.. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఎమ్మెల్యే పార్థసారథి.. నియోజకవర్గ ప్రజల మీదే నేను ఆధారపడి ఉన్నాను.. నా భవిష్యత్ కార్యాచరణను పెనమలూరు నియోజకవర్గ ప్రజలే తేలుస్తారు అంటున్నారు. ఇక, వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!