Minister Harishrao: దేశానికి ధాన్యాగారం తెలంగాణ.. కేంద్రం కళ్ళు తెరవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ విలసిల్లుతోందని, అయితే కేంద్రానికి ఈ విషయంలో సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంకటహర చతుర్ధి సందర్భంగా గణేష్ గడ్డ దేవాలయం లో 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాము. చాలా సంతోషం.పాశ మైలారం నుండి ORR వరకు 121 కోట్ల రూపాయలతో లింక్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాము. జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.
గతం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కోసం సీఎం కేసీఆర్ గారిని స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ గారు కోరగానే 14 ఎకరాలు కేటాయించారు. పటాన్ చేరు మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దుతాం.. త్వరలో పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సంగారెడ్డి లో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తారు. సంగారెడ్డి, పటాన్ చెరులో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ పట్ల దశ దిశ లేకుండా పని చేస్తుంది. బియ్యం ఎగుమతులపైన ఎందుకు నిషేధం విధించారో చెప్పాలన్నారు.
Also Read
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- KTR: 'రాజ్యమా ఉలిక్కిపడు'.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
కేంద్ర మంత్రి వరి వేయిద్దు అంటున్నారు. నూకలు తినమని తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. ఆరు నెలల కింద నాలుగు సంవత్సరాలకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని ప్రకటించి, నేడు బియ్యం, నూకల ఎగుమతుల పైన ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు. కేంద్రానికి ఇంకా సోయి రావడం లేదు.. రైతులను కొడుతూ..కార్పొరేటర్లకు పంచుతున్నారు. కేంద్రం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి. నిషేధం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం, ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోంది. దేశానికి ధాన్యాగారం తెలంగాణ అన్నారు హరీష్ రావు. తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. కేంద్ర ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.
తెలంగాణలో పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రం తీరు అసంబద్దంగా వుందన్నారు. వడ్లు కొనరు.. నూకలు వద్దంటారు.. అవగాహన లేని పాలన తో ప్రజలు, రైతులకు నష్టం కలుగుతుందన్నారు. రైతు ఆదాయం ఎక్కడ పెరిగింది? దేశంలో నిల్వలు ఉంటే నిషేధం ఎందుకు పెట్టారు?భేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు.
Read Also: Telangana VC Ravinder Gupta: మరోసారి వివాదంలో వీసీ.. డబ్బులు ఎగురవేస్తూ విద్యార్థులతో నృత్యాలు..
తాజావార్తలు
-
Shreyas Iyer Trolls: గెలిచినా శ్రేయస్పై విమర్శలు.. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికపై ప్రశ్నలు!
-
Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
-
Asian Games 2026 Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఒక్కటే ఛాన్స్!
-
Abhijeet Dipke: వాంగ్చుక్ దీక్ష విరమించినా తగ్గేదేలే.. కేంద్రానికి అభిజీత్ దిప్కే వార్నింగ్..
-
Honda ADV 160: మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. హోండా ADV 160తో సహా 10 టూవీలర్ల ఆవిష్కరణ..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!