వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ పట్టాభిషేకం చేయడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు వైసీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి పోలిస్తే చంద్రబాబు నాయుడుది అబద్దాల ప్రభుత్వం అన్నారు. గతంలో అందరినీ మోసగించి మోసపూరితమైన వాగ్దానాలు చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. గతంలో అనేకమార్లు ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగనన్న ఇళ్ళ పథకంపై ఆయన వ్యాఖ్యలు స్వంత పార్టీ నేతల్ని షాక్ కి గురిచేశాయి.
Read Also: Special Story on Startups in India: మన దేశంలో స్టార్టప్లు వేల సంఖ్యలో స్టార్ట్ అవుతున్నాయి. కానీ..
తర్వాత ప్రజలను రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. .మన రాష్ట్రాన్ని చూసి తమిళనాడులో స్టాలిన్ సచివాలయ వ్యవస్థ ను అక్కడ ఏర్పాటు చేశారన్నారు. రాబోయే రోజులో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో ఒక రోజు భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతారని ప్రసన్నకుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
Read Also: Ranjith Reddy: వేదికపై అలా మాట్లాడటం సరికాదు.. అస్సాం సీఎంపై రంజీత్ రెడ్డి సీరియస్