Minister Harish Rao: హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లో హెల్త్ సిటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. సుమారు వెయ్యి మంది కార్మికులు పని చేస్తున్నారు. రూ. 20 లక్షల 76 వేల ఎస్ఎప్టీ తో హెల్త్ సిటి నిర్మిస్తున్నామని హరీష్ రావు అన్నారు. 2100 పడకలతో హెల్త్ సిటి నిర్మిస్తున్నామన్నారు. 800 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉంటాయి. 68 శాతం పనులు పూర్తయ్యాయి.. ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి చేసి జనవరిలోగా అందుబాటులోకి ఇంజినీరింగ్ అధికారులు తీసుకొస్తున్నారు అని ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.
Read Also: Ramakrishna : రమ్యకృష్ణ కు ఈ టాలెంట్ కూడా ఉందా?
Also Read
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
దసరా వరకు 10 ఫ్లోర్ లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని చూస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆసుపత్రిలో అన్ని వసతులతో ధర్మశాలను నిర్మిస్తున్నాం.. 400 మంది రెసిడెన్సీ డాక్టర్స్ ఉంటారు.. వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ తో పాటు హెల్త్ సిటి ని నిర్మిస్తున్నాం అని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే సంవత్సరం ములుగు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Read Also: Nellore Crime: నెల్లూరులో విషాదం.. పిల్లల్ని రక్షించబోయి తల్లులు మృతి
ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంతో ఉన్న ములుగులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం దేశంలో ఎక్కడ లేదు మంత్రి హరీష్ రావు అన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతమని సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. 70శాతం డెలివరీ లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నాయి.. కాంగ్రెస్ పాలన తీసుకువస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ పాలన అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సూది మందులు ఉండవు… గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఆపరేషన్ లు జరిగేవి మంత్రి హరీష్ రావు పేర్కోన్నారు.
Read Also: Trivikram: సూపర్ స్టార్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్…
కేసిఆర్ పాలనలో సీన్ రివర్స్ అయింది.. ఎయిమ్స్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది.. మెడికల్ కాలేజీల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.. కేంద్రం ఇచ్చింది ఒక్క మెడికల్ కాలేజీ అదికూడా అతిగతిలేకుండా ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ళలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ప్రజల వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ కు దమాక్ పని చేయడం లేదు.. పని చేయరు.. చేసే వారిని విమర్శిస్తారు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు.. నిర్మాణాత్మకమైన సూచనలు సలహాలు ఇవ్వండి.. కానీ విమర్శించడం సమంజసం కాదు అని మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!