Harish Rao: బీఆర్ఎస్ సర్కార్ రైతును రాజు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు బంధు పథకం కొత్తది కాదు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసీనీ కాంగ్రెస్ నేతలు కలిసి రైతు బంధు ఆపాలని కోరింది అని ఆయన తెలిపారు. కేసీఅర్ రైతు బంధు తర్వాతే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకు వచ్చింది.. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు.. 69 లక్షల మందికి రైతు బందు అందుతోంది.. కాంగ్రెస్ పార్టీ కుట్రతో వ్యవహరిస్తుంది.. రైతు బంధు సకాలంలో అందకుండా చేస్తుంది.. రేపు అసరా పెన్షన్ తో పాటు ఇతర స్కీమ్ లు ఆపమని కాంగ్రెస్ కోరుతుంది ఏమో? అని హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు లెటర్ ఎలా ఇస్తుంది? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేఖ ప్రభుత్వం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ … ఉత్త కరెంటు చేసింది.. కర్ణాటక నుంచి రైతుల వచ్చి గద్వాల్ ,కొడంగల్ లో కాంగ్రెస్ ను నమ్మవద్దని చెబుతున్నారు.. కర్ణాటకలో కనీసం 5 గంటలు కరెంటు కూడా ఇవ్వడం లేదు అని ఆయన ఆరోపించారు. మూడు గంటలు కరెంట్ ఇవ్వడం లేదు అని కర్ణాటక రైతులు ఆందోళన చేస్తున్నారు.. కాంగ్రెస్ సర్కార్ నీళ్ళు ఇవ్వకపోయినా.. నీటి తిరువా కట్టించుకుంది అని మంత్రి పేర్కొన్నారు. కేసీఅర్ వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. బీఆర్ఎస్ సర్కార్ రైతును రాజు చేసింది అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Mahar Yodh 1818: ‘కోరేగావ్ యుద్ధం’పై సినిమా.. ఫాంటసీ థ్రిల్లర్ గా!
పొరపాటున, గ్రహ పాటున గెలిస్తే రైతు బంధుకు కాంగ్రెస్ రామ్ రామ్ అంటది అని హరీశ్ రావు చెప్పారు. మూడు గంటలు కరెంటు రైతులకు ఇస్తది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దండగ అన్నారు.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో రైతులను రోడ్డు మీదకు తీసుకు వచ్చారు.. రైతుల మీద ప్రేమ ఉంటే ఈసీకి ఇచ్చిన లేఖను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవాలి.. తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవాలి.. రైతు బంధు ఒక నెల రోజులు అపుతారేమో? కానీ, మళ్ళీ యధావిధిగా రైతు బంధు ఇస్తామని ఆయన వెల్లడించారు. రైతు రుణమాఫీ మూడు వేల కోట్లు చేయాలని ఈసీకి లేఖ రాశాం.. ఈసీ అనుమతి ఇస్తే మిగిలిన వ్యవసాయ రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?