2022-23 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్ రావు ఆదివారం తెలిపారు. మొత్తం 33 జిల్లాల్లో ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటు నేపథ్యంలో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ప్రాంతమైన కొత్తగూడెంలో ఈ మెడికల్ కాలేజీ ఒకటి వచ్చిందని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చరిత్రాత్మకంగా నిలిచారని మంత్రి అన్నారు. తెలంగాణలో గత ఏడు దశాబ్దాల్లో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయని, తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని హరీశ్ రావు అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 16 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య కళాశాలల కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విన్నవించినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదని మంత్రి పేర్కొన్నారు.
Also Read : Treasury Scam: చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతున్న ట్రెజరీ బిల్లుల స్కాం
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు కాలేదని, ఉత్తరప్రదేశ్కు 27 కొత్త మెడికల్ కాలేజీలు, మధ్యప్రదేశ్కు 19 కాలేజీలు వచ్చాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 157 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని ఆయన సూచించారు. తెలంగాణలోని పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మధ్య ఇటీవల మెడికల్ కాలేజీల విషయంలో మాటల యుద్ధం జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని మంజూరు చేయలేదని కేటీఆర్ పేర్కొన్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎటువంటి ప్రతిపాదనను సమర్పించలేదని మాండవీయ పేర్కొన్నారు. వైద్య కళాశాలల కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని నిరంతరం అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.