Gudivada Amarnath: వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్ రెండోసారి సీఎం కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: వచ్చే ఏడాది వైఎస్సార్ జయంతి నాటికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైస్సాఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఒక్కటైన సొంత ఆలోచన ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ ప్రకటించారు. 175 సీట్లను ఎలా గెలవాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే.. 175 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కోసం చంద్రబాబు ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య నక్కకి నాగలోకానీకి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు అమర్నాథ్. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు కాగా.. మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎంపీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.. దివ్యాంగులకు బ్యాటరీ బైక్ లు పంపిణీ చేశారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Also Read
- Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
- Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
ఇక, పెందుర్తి సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు హామీలు ఇవ్వడం ఒక ఫ్యాషన్.. వాటిని ఎన్నడూ అమలు చేయరు అని విమర్శించారు. చంద్రబాబు రక్తంలో హామీలు అమలు అనే మాట లేదు.. మోసం చేసి అధికారంలోకి రావడమే ధ్యేయం అని ఆరోపించారు. టీడీపీ, జనసేన మోసపూరిత హామీలను నమ్మొద్దు అని సూచించారు. పెందుర్తి ఎమ్మెల్యేగా అదీప్ రాజ్ ను,ముఖ్యమంత్రిగా జగన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్న వైవీ.. ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతుల ఆత్మహత్యలను అడ్డుకున్న మహా నేత వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వైఎస్సార్ ముందు చూపుతోనే సాధ్యం అయ్యిందన్న ఆయన.. వైజాగ్ ఎయిర్ పోర్టును 100 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ ది అన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు నిర్మాణం వేగంగా జరుగుతోందని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
తాజావార్తలు
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!