NTV Telugu Site icon

Errabelli Dayakar Rao: బండి సంజయ్‌ ఓ పిచ్చోడు.. రేవంత్‌ రెడ్డికి మెదడు లేదు..

Errabelli

Errabelli

Errabelli Dayakar Rao: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ క్రమంలో విపక్ష నేతలతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పిచ్చోడని.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతాడని.. రేవంత్ రెడ్డికి మెదడు లేదని ఆయన విమర్శించారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయానికి మోటర్లకు మీటర్లు పెట్టను అన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని ఎర్రబెల్లి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు.

Read Also: Telangana Railway: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమాధానం.. ఏమన్నారంటే?

మన కేసీఆర్‌ను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఆయన అన్నారు. కొప్పుల ఈశ్వర్ ఒక మంచి వ్యక్తి అని.. ఈ నియోజకవర్గం ప్రజలకు ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ధరలు పెరిగాయి అంటే అది కేంద్ర ప్రభుత్వమే పెంచుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో రైతుల పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. గ్యాస్ ధరలను పెంచింది మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 365 రోజులు నీళ్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు. 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమేనన్నారు.