Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Railway Minister Ashwini Vaishnav Reply On Telangana Railway Projects

Telangana Railway: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమాధానం.. ఏమన్నారంటే?

Published Date :April 3, 2023 , 4:28 pm
By Mahesh Jakki
Telangana Railway: తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమాధానం.. ఏమన్నారంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Railway Projects in Telangana: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయని.. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ 1, 2022 వరకు రూ.30,062 కోట్ల విలువైన 2,930కిమీల రైల్వే లైన్లు వివిధ దశల్లో ఉన్నాయని.. ఇందులో 8 కొత్తలైన్లు, 5 డబ్లింగ్ లైన్లు ఉన్నాయన్నారు. మార్చి 22 వరకు రూ.6,514 కోట్ల విలువైన 272 కిలోమీటర్ల రైల్వే లైను పూర్తి అయ్యిందన్నారు. 8 కొత్తలైన్లలో 1053 కి.మీలకు రూ.16,686 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించగా.. రూ.3,596 కోట్ల విలువైన 221కి.మీల లైన్ పూర్తి అయ్యిందని రైల్వే మంత్రి వెల్లడించారు. 5 డబ్లింగ్ ప్రాజెక్టుల దూరం 1337కి.మీలు కాగా రూ.13,376 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. అందులో రూ.2,918 కోట్లతో 52కి.మీల డబ్లింగ్ పనులు పూర్తి అయ్యాయని కేంద్రమంత్రి తెలిపారు.

మనోహరాబాద్ – కొత్తపల్లి, భద్రాచలం -కొవ్వూరు, అక్కన్నపేట – మెదక్, భద్రాచలం – సత్తుపల్లి, హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ ఫేస్ -2 ఈ ఐదు ప్రాజెక్టులకు గాను రూ.7,350 కోట్ల గాను అంచనా ఉండగా.. రూ.2,588 కోట్లు ఇప్పటికే ప్రాజెక్టుల మీద ఖర్చు జరిగింది. రూ.1,279 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేసింది. ఇంకా రూ.986 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేయాల్సి ఉంది. రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణలో 2095 హెక్లార్ట రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల ఫారెస్ట్ భూమి అవసరం కాగా ఇప్పటి వరకు తెలంగాణ సర్కారు 1918 హెక్టార్ల రెవెన్యూ భూమిని, 41 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని సేకరించింది. ఇంకా 41 హెక్టార్ల రెవెన్యూ భూమి, 15 హెక్టార్ల అటవీభూమిని తెలంగాణ ప్రభుత్వం సేకరించాల్సి ఉంది.

Also Read

  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
  • Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..

రైల్వే బడ్జెట్‌లో భాగంగా మౌలిక వసతులు కల్పన, రక్షణా పనుల కోసం తెలంగాణ రైల్వేకు 2014-19 వరకు రూ.1,110 కోట్లు కేటాయింపులు జరగగా,
2019-20 కి గాను రూ.2,056 కోట్లు
2020-21కి గాను రూ.2,602 కోట్లు
2021-22కు రూ.2,486 కోట్లు
2022-23కు రూ.3,048 కోట్లు…
2023-24కు గాను ఏకంగా రూ.4,418 కోట్లు కేటాయింపు కేంద్ర రైల్వే శాఖ చేసింది.

2009-14 మధ్యన ఏడాదికి సరాసరి 17.4 కి.మీ.ల రైల్వే కొత్తలైన్లు, డబ్లింగ్ పనులు జరగగా.. 2014 – 2022 మధ్యన ఏడాదికి సరాసరి 55కి.మీ.ల పనితో ఏకంగా 440కి.మీ.ల పనిపూర్తైంది. ఇందులో 229 కి.మీ.ల కొత్తలైన్లు, 211కి.మీ.ల డబ్లింగ్‌ లైన్‌ ఉంది.

స్పందించని తెలంగాణ సర్కార్..
తెలంగాణలో ఎంఎంటీఎస్ ఫేస్ -2 కోసం రూ.816.55 కోట్లు అంచనా వేయగా ఈ ఖర్చు రైల్వే, తెలంగాణ ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాల్సి ఉంది. ఇందులో 544.36 కోట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వాటా ధనంలో కేవలం రూ.279.02 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ విడుదల చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. మిగిలిన 265.34 కోట్ల కోసం కేంద్ర రైల్వే శాఖ అనేకమార్లు తెలంగాణ సర్కార్ కు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందన్నారు. ఎంఎంటీఎస్ ఫేస్ -2 కోసం కేంద్ర రైల్వే శాఖ తన వాటా ధనం కన్నా అధికంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులు ఎక్కడా కూడా తెలంగాణ భూములు అవసరం కూడా రాలేదు. దేశంలో రైల్వే ప్రాజెక్ట్ ల పూర్తికోసం రైల్వే శాఖ మిగిలిన అన్ని శాఖలతో వేగవంతమైన సంప్రదింపులు చేస్తోంది. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రాల నుంచి భూసేకరణ జరగాలి. అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావాలి. రాష్ట్రాల వాటాధనం వెంటనే జమ కావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. స్థానికంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. ఇవన్నీటి కోసం రైల్వే శాఖలో గతిశక్తి డైరక్టరేట్ నియామకంతో పాటు ప్రయారిటీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రాలతోనూ, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడటానికి రైల్వేశాఖ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashwini Vaishnav‌
  • Hyderabad MMTS
  • railway projects in telangana
  • telangana
  • telangana railway projects

తాజావార్తలు

  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే

  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

  • Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!

  • IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!

  • LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions