Minister Venu Gopala Krishna: మంత్రి మల్లారెడ్డికి ఏపీ మంత్రి కౌంటర్.. ఇక్కడికి వచ్చి చూడండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Venu Gopala Krishna: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు.. పోలవరం ప్రాజెక్టు గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడం బెటర్ అని హితవుపలికిన ఆయన.. ఏపీలో సామాజిక న్యాయం అమలు అవుతుందన్నారు.. పోలవరం ప్రాజెక్టును అడ్డుకున్నది వారి నాయకత్వమే అని గుర్తించాలన్నారు.. మరోవైపు.. అశ్వనీదత్ ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నట్లు ఉంది.. అంటూ నిర్మాత అశ్వనీదత్ కామెంట్లపై కౌంటర్ ఎటాక్ చేశారు.. సినిమా పరిశ్రమలోని పెద్దలు తెలుగు సినిమాకి ఇచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి? అంటూ సవాల్ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ..
Read Also: TV Channel: తెలుగు టీవీ ఛానల్లో అర్ధరాత్రి అశ్లీల వీడియోలు.. హ్యాక్ చేసి..
Also Read
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
కాగా, ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషం విదితమే.. కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఏపీ రాజకీయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ శక్తి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. పోలవరం కట్టేది కేసీఆర్ అని చెప్పిన మల్లారెడ్డి.. విశాఖ ఉక్కును కూడా కాపాడతాం అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసీఆర్ సీఎం కావాలని మల్లారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలు ఇస్తామని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను తిడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ స్ఫూర్తితో కార్మికులు కాళేశ్వరం, యాదాద్రి, అంబేద్కర్, సచివాలయాన్ని నిర్మించారన్నారు. హైదరాబాద్ లో కార్మికులకు మంచి రోజులు వస్తాయని మల్లారెడ్డి వెల్లడించారు. మరోవైపు.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!