Minister Venugopal: సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. వారం రోజులపాటు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం ప్రారంభమైన నుండి వాడీవేడీగా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే.. టీడీపీ చంద్రబాబు అరెస్ట్ పై చర్చ కోరుతూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ వాయిదా తీర్మానానికి అనుమతించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో స్పీకర్ సదరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Krishna District: అయ్యంకిలో భగ్గుమన్న పాతకక్షలు.. భార్యాభర్తలు దారుణ హత్య
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
ఈ వ్యవహారంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. సభలో టీడీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ ఛైర్ కు విలువ ఇవ్వకుండా సభాపతి పట్ల అమర్యాదగా నడుచుకున్నారని మండిపడ్డారు. ఇకపోతే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పక్షాన చేరి ఓవరాక్షన్ చేశాడని అన్నారు. చంద్రబాబు ప్రజాధనం ఏ విధంగా లూటీ చేశారో కోర్టుకు అందించామని.. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ వాదించినా కేసులో ఆధారాలున్నాయి కాబట్టే జడ్జి రిమాండ్ విధించారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా వ్యవహరించాడని అన్నారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.
Manchu Lakshmi: సైమా అవార్డుల్లో వ్యక్తిపై చేయి చేసుకున్న మంచు లక్ష్మి..
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజాస్పందన వస్తుందని ఊహించి భంగపడ్డారని మంత్రి వేణుగోపాల్ అన్నారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో పవన్ కల్యాణ్ ను తెచ్చుకున్నారని విమర్శించారు.
సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ నేతలు సభా మర్యాదలను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పయ్యావుల కేశవులు సెల్ ఫోన్ తో చిత్రీరించాలని చూశారని తెలిపారు. సభ నుంచి బయటికి వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నమని అన్నారు. టీడీపీ నేతలు మీసాలు తిప్పినా.. తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. చర్చకు రమ్మని కోరితే వచ్చేందుకు టీడీపీ నేతలకు ధైర్యం లేదని.. నేటి టీడీపీ నేతల తీరు శాసన సభ చరిత్రలోనే దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు.
- Tags
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?