Buggana Rajendranath Reddy: రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో యువత కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇక, మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. యువతకు పెద్దపీట వేసేందుకే మన పార్టీ స్థాపించబడిందన్నారు. మహిళలు ఆడ పిల్లలు స్వేచ్ఛగా జీవించేందు కోసం దిశ యాప్ తీసుకువచ్చామన్నారు. యువత ఉపాధి కోసం 20 కోట్లతో ఐడిటిఆర్ ప్రాజెక్టును నిర్మించాం.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అని తేడా లేకుండా అమ్మ ఒడిని అందించామని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే యువత భాగస్వామ్యంతోనే సాధ్యం.. మేము రాజకీయాల్లో ఉండి ఏ అభివృద్ధి చేసినా మీకోసమే.. మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏమి చేసినా మీ అభివృద్ధి కోసమే అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
Read Also: Kakarla Suresh: ప్రతి టీడీపీ కార్యకర్తను కాపాడుకుంటా, వారికి అండగా ఉంటా..!
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
మీరు రాజకీయాల్లో బచ్చా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. డోన్ అడ్డా అని మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడికి డోన్ లో సొంత ఇల్లు లేదు, సొంత పార్టీ కార్యాలయం లేదు ఎందుకు? అని ప్రశ్నించారు. మీ రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి చేయని మీ రాజకీయం అనుభవం దేనికి.. మీ రాజకీయ అనుభవం ఎంత.. మీరు చేసిన అభివృద్ధి ఎంత? చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులు, ఉపముఖ్యమంత్రులు హోదాలు అనుభవించి మీ సొంత ఊర్లకు రోడ్లు వేయలేని మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది అని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ కొట్టి యువతను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్సాహపరిచారు. ఇక, టీడీపీ పిల్లల శిక్షణ కార్యక్రమాల పేరుతో 270 కోట్ల రూపాయలను దోచుకుంది.. అభివృద్ధిని చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి చేసిన నాయకుని ఎన్నుకోండి.. అని యువతకు ఆర్థిక మంత్రి బుగ్గన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!