Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..
- తృణమూల్ కాంగ్రెస్లో కలకలం..
- మమతా తీరుని నిరసిస్తూ రాజ్యసభ ఎంపీకి జవహర్ సిర్కార్ రాజీనామా..
- కోల్కతా డాక్టర్ కేసులో వ్యవహారశైలితో విసిగిపోయానన్న సిర్కార్..
Trinamool Congress: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. కొల్కతా ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసీని లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో కొంతమంది అవినీతిపరులు నియంత్రణ లేని మితిమీరిన వైఖరిని అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కరువైందని పేర్కొన్నారు.
‘‘ఆర్జి కర్ హాస్పిటల్లో జరిగిన భయంకరమైన సంఘటన నుండి నేను ఒక నెల పాటు ఓపికగా బాధపడ్డాను మరియు మమతా బెనర్జీ తన పాత శైలిలో ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో మీ ప్రత్యక్ష జోక్యం కోసం ఆశించాను. అది జరగలేదు మరియు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న శిక్షాత్మక చర్యలు చాలా తక్కువ మరియు చాలా ఆలస్యంగా ఉన్నాయి,’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. సరైన పరిపాలనపరమైన చర్యలు తీసుకుని దోషుల్ని ప్రభుత్వం శిక్షించి ఉంటే రాష్ట్రంలో ముందుగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
READ ALSO: America : గే అన్నందుకు 14ఏళ్ల బాలుడు కాల్పులు.. నలుగురు మృతి
తన రాజీనామా తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి వైదొగుతానని చెప్పారు. తన రాజీనామాని ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్కి సమర్పిస్తానని చెప్పారు. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరియు హత్యకు గురైంది. ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపించిదని కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, మొదటి నుంచి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వ్యవహార శైలి అనుమానాస్పదంగానే ఉంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో పాటు ఘటన స్థలంలో ఘటన జరిగిన తర్వాత రోజే పునరుద్ధరణ పనులకు ఆదేశాలు ఇచ్చాడు. బాధిత యువతి మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రుల్ని 3 గంటల పాటు అనుమతించలేదు. మరోవైపు టీఎంసీ నాయకులు ఆందోళన చేస్తున్న డాక్టర్లను, సాధారణ ప్రజల్ని భయపెట్టేలా హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని సీబీఐ అరెస్ట్ చేసింది.
మరోవైపు సిర్కార్ వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆందోళనకారులు పరిపాలనని తప్పుగా అర్థం చేసుకున్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ప్రస్తుతం మేం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో సైనికుల వలే పని చేస్తున్నామని చెప్పారు. సిర్కార్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ వ్యవహారంలో బీజేపీ స్పందించింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజీనామా చేయాల్సి వస్తే అది మమతా బెనర్జీ అయి ఉండాలి అని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతిని సంస్థాగతం చేసిందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!