Minister Anam Ramanarayana Reddy: శాసనసభ అంటే వారికి గౌరవం లేదు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..
- వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేసిన మంత్రి ఆనం..
- శాసనసభ అంటే ఆయనకు గౌరవం లేదని వ్యాఖ్య..
- వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam Ramanarayana Reddy: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ.. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసనసభ అంటే ఆయనకు గౌరవం లేదని.. సభ నియమాలను కూడా ఆయన ఎప్పుడూ పాటించలేదన్నారు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్పీకర్ ను బెదిరించి పాలన చేశారని విమర్శించారు. శాసనసభ నిబంధనలు కూడా వైఎస్ జగన్కు తెలియవని.. జగన్ సలహాదారులు కూడా అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు. చట్టాలు. రాజ్యాంగం.. నిబంధనలు తెలియని 79 మందిని సలహాదారులుగా జగన్ పెట్టుకున్నారని సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు మాత్రమే వచ్చాయని.. దీంతో ఆయన ఫ్లోర్ లీడర్ గా మాత్రమే ఉండవచ్చన్నారు.
Read Also: CM Revanth: కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగింది..
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
- Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
- Abhishek Banerjee: మమత మేనల్లుడికి బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు..
ఇక, వాలంటీర్ల వ్యవస్థ పై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందన్నారు మంత్రి ఆనం.. కనీసం, ఒక గంట సేపు జగన్.. ఎక్కడైనా వుండాలనుకున్నా.. ఆయన ప్యాలస్ నే కోరుకుంటారన్నారు. అందువల్లే ఎలాంటి అనుమతులు లేకుండా 28 చోట్ల పార్టీ కార్యాలయాల పేరుతో పెద్ద ప్యాలస్ లను కడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఈ కార్యాలయాలను ఆస్తులుగా ఆయన మార్చుకుంటారని ఆనం విమర్శించారు. మరోవైపు.. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. అందుకే టీటీడీని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నారు. ఎన్నికల్లో సవాళ్లు విసిరి.. ఓడిపోయిన నాయకులకు పిచ్చి పట్టిందని.. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్.. తిరుపతి జిల్లాలో మరో వ్యక్తి ఉన్నారన్నారని సెటైర్లు వేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
తాజావార్తలు
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!