Gudivada Amarnath: కేఏ పాల్ తో తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర ఆయనది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిస్తే తప్ప పోటీ ఇవ్వలేమని తెలిసి రాజకీయ పార్టీలు అన్నీ ఏకం అయ్యాయని విమర్శించారు. చంద్రబాబుకు పొత్తులు కొత్త కాదని దుయ్యబట్టారు. మేలు చూసి ఓటేయమని ముఖ్యమంత్రి అడుగుతుంటే.. పొత్తు చూసి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. KA పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.
Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
మేం ఎన్నికలకు సిద్ధం అంటుంటే.. పొత్తుల కోసం అమిత్ షా ఇంటి ముందు మేం సిద్ధం అని పవన్, చంద్రబాబు నిలబడ్డారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుల తెరపైకి ఇప్పుడు మూడో కృష్ణుడిని తెచ్చారు.. బీజేపీకి వైసీపీకి సంబంధాలు ఉన్నాయని ప్రజలను నమ్మించే తప్పుడు ప్రచారం టీడీపీ చేసిందని అమర్నా్థ్ తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంబంధాలు తప్ప అక్రమ రాజకీయ సంబంధాలు తమ పార్టీకి అవసరం లేదని పేర్కొన్నారు. తెరవెనుక మిత్రులు ఎవరో ఇప్పుడు తేలిపోయిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. బీజేపీ పొత్తులపై టీడీపీ, జనసేన ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్షంగా బీజేపీతో, పరోక్షంగా కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగించడం చూస్తేనే మీ ఓటమి అర్థం అయ్యిందని ఆరోపించారు. తెలుగువారి ఆత్మ గౌరవం ఢిల్లీ రోడ్లపై పెట్టినప్పుడే టీడీపీ, జనసేన పరిస్థితి అర్థం అయిందని మండిపడ్డారు. చంద్రబాబుకు వయసురీత్యా అవసరం అయిన ఊతకర్ర లాంటిదే ఇప్పుడు పొత్తు అని విమర్శించారు.
Tamannah Bhatia : శివరాత్రి పర్వదినాన శివుడి సేవలో లీనమైన స్టార్ హీరోయిన్స్..
పవన్ కళ్యాణ్ వైఖరిపై జనసేన నాయకత్వం ఆలోచించుకోవాలని మంత్రి తెలిపారు. 2019ఎన్నికల ఫలితాలు పవన్ కళ్యాణ్ విషయంలో పునరావృత్తం అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు.. పంచుకోవడం, పోటీ చేయడం మాకు అసందర్భమన్నారు. రాష్ట్రంలో అన్ని పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ముద్రగడ మనస్తత్వం మాకు తెలుసు.. ఆయన ఏదీ ఆశించి రాజకీయాలు చేస్తారని అనుకోనన్నారు. వచ్చే ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య జరుగుతాయి.. మా సోషల్ ఇంజినీరింగ్ మాకు వుంది.. మేము దానిని ఫాలో అవుతామని మంత్రి తెలిపారు. కాపులు డిమాండ్ల పరిష్కరించడంలో హామీ ఇచ్చి చంద్రబాబు చేయలేదు.. మేం ఎక్కువ మేలు చేశామని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!