NTV Telugu Site icon

Minister Adimulapu Suresh: బీజేపీపై మంత్రి ఆదిమూలపు హాట్‌ కామెంట్లు..

Adimulapu Suresh

Adimulapu Suresh

Minister Adimulapu Suresh: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి వేస్తామంటున్నారు.. భారతదేశం గర్వించదగ్గ మేధావి బీఆర్ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ ఆరోపించారు. అంబేద్కర్‌ పేరు పలకటం కూడా బీజేపీ నేతలకు ఇష్టం లేదన్న ఆయన.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను మర్చిపోయే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఓ కుట్ర జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చి వేస్తారట.. సమూలంగా తీసివేస్తారట అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నే కాదు.. బీజేపీ వాళ్లు దళిత జాతినే మార్చివేస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. దళిత జాతిని తొక్కేస్తారు.. మైనారిటీలకు మద్దతు ఉండదు.. బీజేపీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్‌. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరిన విషయం విదితమే.. ఆ తర్వాత క్రమంగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు.. ఇలా వరుసగా ఆ మూడు పార్టీలను టార్గెట్‌ చేస్తున్నారు.. గతంలో టీడీపీ, జనసేన టార్గెట్‌గా విమర్శలు గుప్పించిన నేతలు.. ఇప్పుడు బీజేపీని కూడా ఆ జాబితాలో చేర్చారు.

Read Also: CM Jagan: వారి ఖాతాల్లోకి ఏకంగా 161.81 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌..!