Minister Adimulapu: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందేనని అన్నారు. అన్నీ ఆధారాలతోనే దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టాయని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పిన లోకేష్ ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడని మంత్రి తెలిపారు. 20 మంది అడ్వకేట్లను చుట్టూ కూర్చోబెట్టుకుని బెయిల్ కోసం ప్రార్దనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ స్కాంలో ఆయన పాత్ర స్పష్టమైందని చెప్పారు. ఇవి రాజకీయ ప్రేరేపిత కేసులు కావని.. వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కేసుల రద్దుకు, బెయిల్ కోసం ఎన్ని పిటిషన్లు వేసినా ఏమయ్యాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకుని ఈరోజు కేసులు వచ్చాయంటే ఎలా అని విమర్శించారు.
Read Also: Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై వీడిన ఉత్కంఠ
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
మరోవైపు కృష్ణా జిల్లాలో చివరి చుక్క కూడా సాధించే వరకూ పోరాటం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణా మిగులు జలాలతో చేపడుతున్న ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామని తెలిపారు. ఈనెల ఆఖరికి వెలిగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దశల వారీగా మధ్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Read Also: Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్
ఇదిలా ఉంటే.. ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ కప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ-14గా పేర్కొంది. ఈ క్రమంలో లోకేశ్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అంతకుముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!