Nimmala Rama Naidu: మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల.. పార చేతపట్టి మరీ..!
- మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల
- పార చేతపట్టి సభా ప్రాంగణాన్ని చదును చేసిన నిమ్మల
- ఈరోజు సాయంత్రం కడపకు సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి తొవ్వుతూ.. సభా ప్రాంగణాన్ని చదును చేశారు.
వర్షం వచ్చినా మహానాడు నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఆటంకం కలిగినా.. రాబోవు మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రెంసింగ్ పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో మంత్రి నిమ్మల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
Also Read: Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి!
కడపలోని కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం సహా కడప, కమలాపురం మొత్తం పసుపుమయమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం కడపకు రానున్నారు. నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి మహానాడు ప్రాంగణంలోనే బస చేనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను మంత్రి నిమ్మల ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ రోజు మంత్రి నారా లోకేశ్ కుప్పం నుంచి కడపకు చేరుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ మంత్రులంతా కడపకు తరలివచ్చారు.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..