Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రజలు నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నారు. విండోస్ సిస్టమ్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) లోపం కనిపిస్తుంది. దీని కారణంగా సిస్టమ్ ఉన్నట్లుండి క్లోజ్ అవుతుంది. ఈ బగ్ కారణంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు ప్రభావితమయ్యాయి. దీని కారణంగా చాలా బ్యాంకుల పని నిలిచిపోయింది. మైక్రోసాఫ్ట్ ఇటీవలి క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ తర్వాత ఈ బగ్ వచ్చిందని చెబుతున్నారు.
Read Also:Children Begging: విదేశీయుల ఆటోను వెంబడించిన భిక్షాటన చేస్తున్న చిన్నారులు..
Also Read
- MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ఈ బగ్పై మైక్రోసాఫ్ట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీని వల్ల ఆస్ట్రేలియా యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ బగ్ హార్డ్వేర్లో ఉందా లేదా సాఫ్ట్వేర్ లో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు ఇటీవల కొత్త సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేశారని.. ఉన్న ఓఎస్ లను అప్డేట్ చేశారని చెప్పారు. ఆ తర్వాత కూడా వారికి కూడా ఈ సమస్య తలెత్తింది.
As our systems are impacted by an ongoing issue with Microsoft Azure, we are experiencing high volumes at contact centre. Please contact us only if your travel is within 24 hrs.
— IndiGo (@IndiGo6E) July 19, 2024
Read Also:Raj Tarun-Malvi Malhotra: రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. పలుమార్లు హోటల్లో..!
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ప్రభావితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల సర్వర్లలో అంతరాయం కారణంగా, చాలా కంపెనీల విమానాలు టేకాఫ్ కాలేకపోయాయి. సాంకేతిక లోపాలతో విమానయాన సంస్థలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు సిడ్నీ, పెర్త్ విమానాశ్రయాలలో కూడా చెక్-ఇన్ చేయలేరు. ఫ్లైట్రాడార్ 24 ట్రాకింగ్ డేటా సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్లలో విమానాలు నిలిచిపోయినట్లు చూపిస్తుంది. గ్లోబల్ టెక్నికల్ అంతరాయంతో కొన్ని ఎయిర్లైన్ కార్యకలాపాలు, టెర్మినల్ సేవలపై ప్రభావం పడిందని సిడ్నీ ఎయిర్పోర్ట్ ప్రతినిధి తెలిపారు. ముంబయి, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. స్పైస్జెట్ సైతం ఇదేతరహా సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!