MGNREGS: ఉపాధి హామీకి కౌంట్ డౌన్.. ఫుల్ పవర్స్ వారికే..
- మే 1 నుంచి కొత్త రూల్స్..
- 100 నుంచి 125 రోజులకు పెరగనున్న పని దినాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి పెను మార్పులు తీసుకురాబోతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ఇకపై వీబీ జీ రామ్ జీ (VB GRAMJI – వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్) గా కొత్త రూపు సంతరించుకోనుంది. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా.. పని దినాల సంఖ్య, పనుల ఎంపిక .. అమలు తీరులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పనుల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఉపాధి హామీలో సరికొత్త మార్పులు..
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానం వల్ల కూలీలకు , గ్రామ పంచాయతీలకు కొన్ని కీలక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకు ఒక కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని కల్పించగా, కొత్త పథకంలో ఆ గడువును 125 రోజులకు పెంచారు. దీనివల్ల కూలీల వార్షిక ఆదాయం పెరగనుంది. అంతే కాకుండా.. గతంలో పనుల ఎంపికలో మండల స్థాయి అధికారుల జోక్యం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు గ్రామ అవసరాలను బట్టి అక్కడి పంచాయతీలే పనులను ఎంచుకునే అధికారం కల్పించారు. అంటే ఫుల్ పవర్స్ గ్రామ పంచాయతీలకే ఇచ్చారు.
Also Read
- RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Also Read:Health Tips: స్నానం ఎప్పుడు చేస్తే మంచిది.. ఉదయం లేదా సాయంత్రం..?
కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా అంగన్వాడీ భవనాలు, స్కూల్ టాయిలెట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యామ్ల వంటి శాశ్వత నిర్మాణాలకు కూడా దీనిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త పథకంలో 266 రకాల పనులను చేర్చినప్పటికీ.. గతంలో రైతులకు ఎంతో మేలు చేసిన కొన్ని పనులను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా.. చెరువుల నుంచి పొలాలకు ఒండ్రుమట్టి తరలింపు, వ్యక్తిగత పొలాల్లో భూమిని చదును చేయడం, పిచ్చిమొక్కలు లేదా కంపచెట్ల తొలగింపు వంటి పనులకు ఇకపై అనుమతి ఉండదు.
ఒండ్రుమట్టి వల్ల పొలాలు సారవంతం అవుతాయని, ఈ పనులను మే నెల వరకు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పాత పద్ధతిలో చేసే పనులన్నీ ఈ ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మాత్రం భూ అభివృద్ధి పనులకు కొంత మినహాయింపు లభించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!