MGM : ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం.. ఒకేరోజు 77 మంది ఉద్యోగులకు మెమోలు
- ఆకస్మిక తనిఖీలో బయటపడిన లోపాలు
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు
- ఒకేరోజు 77 మందికి మెమోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MGM : వరంగల్ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్యశాల అయిన ఎంజీఎం ఆసుపత్రిలో పెద్ద స్థాయిలో ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతుల్లేకుండా విధులకు హాజరు కాకపోవడం వంటి కారణాలతో మొత్తం 77 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. ఈ ఘటన ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ బాగా అధ్వానంగా ఉండటం అధికారులు గమనించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రజాప్రతినిధులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ కలెక్టర్కు ఫోన్ చేసి ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, బాధ్యతలలో విఫలమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, వారిని వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఆదేశాల మేరకు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టారు. రిజిస్టర్లో సంతకాలు చేయని వారు, విధులకు హాజరుకాని ఉద్యోగులు, వైద్యులను గుర్తించి వారందరికీ మెమోలు జారీ చేశారు. ఈ చర్యలు ఆసుపత్రి పరిపాలనలో ఉన్న తేడాలను బయటపెట్టినట్లయింది.
ఒకేరోజులో 77 మంది ఉద్యోగులకు మెమోలు జారీ కావడం ఎంజీఎం ఆసుపత్రి చరిత్రలోనే తొలి సారి. ఆసుపత్రిలో ఉన్న కార్యనిర్వహణ లోపాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిణామాలు ప్రభుత్వ వైద్యవ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత కోసం తీసుకునే చర్యల క్రమంలో కీలక మలుపుగా నిలిచాయి. ఉద్యోగుల నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయంలో ఈ చర్యలు ఒక హెచ్చరికగా మారనున్నాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?