Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిధ్యం
- పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- తృటిలో తప్పిన ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.
Read Also: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ప్రస్తుతం జాతీయ మహిళల వన్డే ఛాంపియన్షిప్ 2024-25 కరాచీలో జరుగుతోంది. ఈ కారణంగా వివిధ టీం బృందాలు హోటల్లో బస చేశాయి. ఆ సమయంలో హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఐదుగురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ప్రమాదం తర్వాత పీసీబీ టోర్నీని మధ్యలోనే నిలిపివేసింది. పాకిస్తాన్ బోర్డు 5 బృందాలు, అధికారుల కోసం హోటళ్లను బుక్ చేసింది. సమాచారం మేరకు, 4 జట్లు ఐదవ రౌండ్లో ఆడటానికి వెళ్ళాయి. ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లు, అధికారులు హోటల్లో లేరు. నెట్ ప్రాక్టీస్ కోసం నేషనల్ స్టేడియంలో ఉన్నారు వారంతా.
Read Also: Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?
ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, అయితే వారి వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఐదుగురు ఆటగాళ్లు తమ గదుల్లో ఉన్నారు. దీంతో ఆటగాళ్లు, అధికారుల కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పై పీసీబీ మాట్లాడుతూ.. ‘టీమ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, కరాచీలో జరిగే జాతీయ మహిళల వన్డే టోర్నమెంట్ 2024-25ను ముగించాలని పీసీబీ నిర్ణయించింది. అదృష్టవశాత్తూ, సంఘటన సమయంలో హోటల్లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లను పిసిబి వెంటనే ఖాళీ చేయించడంతో ఎవరికీ ఏమి కాలేదు.
Pakistan cancelled their Women's domestic tournament after a huge fire broke out in Karachi team hotel.
5 cricketers had to be rescued by breaking windows of the hotel.
All their equipments got destroyed.
Champions Trophy SF & matches of AFG, SA & NZ is scheduled in Karachi. pic.twitter.com/D4YlYP1B4E
— Johns (@JohnyBravo183) November 18, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!