Fire Accident In Hotel: క్రికెటర్స్ ఉన్న హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిధ్యం
- పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం
- తృటిలో తప్పిన ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Hotel: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటగాళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ పెను ప్రమాదం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), వారి ప్రభుత్వ సన్నాహాలను బహిర్గతం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో జరిగే అవకాశాలు మరింతగా దిగజారాయి.
Read Also: Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ప్రస్తుతం జాతీయ మహిళల వన్డే ఛాంపియన్షిప్ 2024-25 కరాచీలో జరుగుతోంది. ఈ కారణంగా వివిధ టీం బృందాలు హోటల్లో బస చేశాయి. ఆ సమయంలో హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఐదుగురు మహిళా క్రికెటర్లు ఉన్నారు. అతి కష్టం మీద వారిని బయటకు తీశారు. ప్రమాదం తర్వాత పీసీబీ టోర్నీని మధ్యలోనే నిలిపివేసింది. పాకిస్తాన్ బోర్డు 5 బృందాలు, అధికారుల కోసం హోటళ్లను బుక్ చేసింది. సమాచారం మేరకు, 4 జట్లు ఐదవ రౌండ్లో ఆడటానికి వెళ్ళాయి. ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగతా క్రికెటర్లు, అధికారులు హోటల్లో లేరు. నెట్ ప్రాక్టీస్ కోసం నేషనల్ స్టేడియంలో ఉన్నారు వారంతా.
Read Also: Dil Raju vs Mythri Movie Makers: దిల్ రాజుకు మైత్రీ మార్క్ కౌంటర్?
ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, అయితే వారి వస్తువులు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఐదుగురు ఆటగాళ్లు తమ గదుల్లో ఉన్నారు. దీంతో ఆటగాళ్లు, అధికారుల కొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పై పీసీబీ మాట్లాడుతూ.. ‘టీమ్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, కరాచీలో జరిగే జాతీయ మహిళల వన్డే టోర్నమెంట్ 2024-25ను ముగించాలని పీసీబీ నిర్ణయించింది. అదృష్టవశాత్తూ, సంఘటన సమయంలో హోటల్లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లను పిసిబి వెంటనే ఖాళీ చేయించడంతో ఎవరికీ ఏమి కాలేదు.
Pakistan cancelled their Women's domestic tournament after a huge fire broke out in Karachi team hotel.
5 cricketers had to be rescued by breaking windows of the hotel.
All their equipments got destroyed.
Champions Trophy SF & matches of AFG, SA & NZ is scheduled in Karachi. pic.twitter.com/D4YlYP1B4E
— Johns (@JohnyBravo183) November 18, 2024
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!