Delhi Airport: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి, బంగారం పట్టివేత
- ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి, బంగారం పట్టివేత
- విదేశీ గంజాయిని 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్లలో తరలించేందుకు యత్నం
- 172 గ్రాముల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఖర్జూరం పండ్లలో కలిపివేసి తరలించేందుకు ప్రయత్నం.
Delhi Airport: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణాను గుర్తించి స్మగ్లర్ల కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో మొత్తం 27 కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో థాయ్లాండ్కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. స్మగ్లర్లు విదేశీ గంజాయిని చాకచక్యంగా 54 ప్యాకెట్లుగా ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్లలో దాచిపెట్టారు. బట్టల తరలింపుగా చూపిస్తూ.. నాలుగు ట్రాలీ బ్యాగ్లను పూర్తిగా గంజాయితో నింపి దుబాయ్ నుండి ఢిల్లీకి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్ సమయంలో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది.
Read Also: Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఈ కేసులో థాయ్లాండ్కు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అధికారులు, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో డ్రగ్స్ తరలింపుకు బదులుగా విదేశీ గంజాయిని అక్రమంగా భారత్కు తరలించే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. అందుకే విదేశాల నుండి ఢిల్లీకి వచ్చే ప్రతి ప్రయాణికుడిపై కస్టమ్స్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. మరోవైపు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో ఆసక్తికరమైన బంగారం స్మగ్లింగ్ ప్రయత్నం విఫలమైంది. కస్టమ్స్ అధికారులు 172 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్
ఒక స్మగ్లర్ ఎలాంటి అనుమానం రాకుండా బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఖర్జూరం పండ్లలో కలిపివేసి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఎయిర్పోర్ట్లో ఉన్న మెటల్ డిటెక్టర్లో అసలు విషయం బయట పడింది. ఈ స్మగ్లర్ను అధికారులు అదుపులోకి తీసుకుని, కస్టమ్స్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాదకద్రవ్యాలు, బంగారం వంటి విలువైన వస్తువుల స్మగ్లింగ్ను నిరోధించేందుకు కస్టమ్స్ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ తరహా అక్రమ రవాణా ఘటనలు పెరుగుతుండటంతో ప్రతి ప్రయాణికుడిపై ప్రత్యేక దృష్టిని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అధికారులు విజయవంతంగా పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!