MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్
- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.
- నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
MLC Elections: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 25,652 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 12,472 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. అలాగే, సిద్ధిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 32,589 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: ENG vs AFG: ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం..
Also Read
మరోవైపు, మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులున్నారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో 2,690 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో 1,347 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సిద్ధిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 3,212 మంది టీచర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, స్వేచ్ఛగా ఓటేయాలని ఎన్నికల అధికారులు కోరారు.
గత 20 రోజులుగా వివిధ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్ని తాయిలాలు ప్రకటించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం సమగ్ర వ్యూహాలు రచించాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న జరుగుతుంది.
తాజావార్తలు
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!