MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్
- గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.
- నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Elections: మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల పోలింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 56 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 25,652 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో 12,472 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. అలాగే, సిద్ధిపేట జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాల్లో 32,589 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also Read: ENG vs AFG: ఉత్కంఠ పోరులో అఫ్ఘానిస్తాన్ విజయం..
Also Read
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
మరోవైపు, మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు అభ్యర్థులున్నారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 28 పోలింగ్ కేంద్రాల్లో 2,690 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ కేంద్రాల్లో 1,347 మంది టీచర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సిద్ధిపేట జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 3,212 మంది టీచర్లు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, స్వేచ్ఛగా ఓటేయాలని ఎన్నికల అధికారులు కోరారు.
గత 20 రోజులుగా వివిధ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ఎన్ని తాయిలాలు ప్రకటించినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం సమగ్ర వ్యూహాలు రచించాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న జరుగుతుంది.
తాజావార్తలు
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!