Kerala: సౌదీ జైల్లో ఉన్న వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు.. ఏం చేశారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు. అయితే 2006లో పొరపాటున బాలుడి చనిపోయాడు. బాలుడి మృతికి రహీమే కారణమయ్యాడని అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు.. మరోవైపు బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో.. 2018లో అబ్దుల్కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం కొన్నాళ్లకు.. ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Gujarat : రూ.200కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్యతో సన్యాసిగా మారబోతున్న వ్యాపారి
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ క్రమంలోనే ఈ నెల 18లోగా సుమారు రూ.34 కోట్లు చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఆ మొత్తం సమీకరించి రహీమ్ను విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా.. కొద్ది మొత్తమే పోగైంది. ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు. ఇలా రూ.34 కోట్లు సేకరించారు. బాధిత కుటుంబానికి ఈ నగదు అందిస్తే రహీమ్ మరణశిక్ష నుంచి బయటపడతాడు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan Tirupati Tour: తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..
తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు వచ్చిందని సంస్థ తెలిపింది. దాదాపుగా ఇప్పటి వరకూ రూ.34.45 కోట్లు వచ్చాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఇక ఎవరూ డబ్బు పంపించవద్దని కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్రస్టు సభ్యులు ప్రజలకు తెలిపారు. రాజకీయ, కుల, మత భేదాలకు అతీతంగా ప్రపంచ కేరళీయులు ఏకమయ్యారని తెలిపారు. ఈ నగదు చెల్లిస్తే.. రహీమ్ మరణశిక్ష నుంచి తప్పించుకుంటాడు.
ఇది కూడా చదవండి: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్క్రిస్ట్.. అసలు మ్యాటరేంటంటే..?!
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..