AP Legislative Council: ఏపీ శాసన మండలికి మార్షల్స్.. దాడికి ప్రయత్నిస్తారా అంటూ బొత్స ఫైర్!
- ఏపీ శాసన మండలికి మార్షల్స్
- ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ సభ్యుల వాకౌట్
- ప్రశ్నించటం తప్పు అన్నట్లుగా మార్షల్స్ను సభలో మోహరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయిదా అనంతరం శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. ఛైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ను ఏర్పాటు చేశారు. మార్షల్స్ రక్షణలో సభ కాసేపు కొనసాగింది. మార్షల్స్ ఏర్పాటుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దుష్ట సంస్కృతి అని బొత్స పేర్కొన్నారు. ఇది పెద్దల సభ అని, ఇలా చేయడం సబబు కాదని ఛైర్మన్ బదులిచ్చారు. మీ సీట్లులో ఉండి నిరసన తెలుపుకోవచ్చని ఛైర్మన్ సూచించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు.
విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ‘బాబు షూరిటీతో ప్రజలను మోసం చేశారు. ప్రభుత్వం వచ్చిన మరునాటి నుంచే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. ఇవాళ మేము సభలో ఇదే అంశంపై ప్రశ్నించాం. మేము ప్రశ్నించటం తప్పు అన్నట్లుగా మార్షల్స్ను సభలో మోహరించారు. వారి వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాం. ఏమైనా అడిగితే గత ప్రభుత్వ బకాయిలు అంటారు. డిసెంబర్ వరకు బకాయిలు మొత్తం ఇచ్చాం. ఆ తరువాత ఎన్నికలు రావటంతో పెండింగ్ పడ్డాయి. ఏదైనా అడిగితే వచ్చే నెల, వచ్చే నెల అంటారు. ఈ ప్రభుత్వం మాటలు తప్ప ఏమీ చేయటం లేదు’ అని అన్నారు.
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
‘సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం మేం మాట్లాడితే మార్షల్స్ మాపై దాడికి ప్రయత్నిస్తారా?. ప్రజల పక్షాన పోరాడుతున్న మా అందరినీ ఇలా చేస్తారా?. ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారు.. తేదీలు ప్రకటించండి. వాళ్ళే లేఖలు ఇచ్చి.. వాళ్ళే మోసం చేస్తున్న అసమర్థ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి లేఖ ఇస్తే ఏపీపీఎస్సీ తిరస్కరించిన సందర్భం ఏమైనా ఉందా. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్నాం’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?