Big News : కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణలతో కలిసి అమిత్షాతో భేటీ అయ్యారు మర్రి శశిధర్ రెడ్డి. ఇదిలా ఉంటే.. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వచ్చానన్న ప్రచారం అవాస్తవం అన్నారు. తాను ఢిల్లీ వచ్చిన విమానంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు ఉన్నారని చెప్పారు. మనవడి స్కూల్ ఫంక్షన్ కోసమే తాను ఢిల్లీ వచ్చానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
Also Read : MLA’s Poaching Case : సిట్ దూకుడు.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు
తాను తరుచుగా ఢిల్లీ వస్తుంటానని చెప్పారు. తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్ కాలేదని గుర్తు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. కొంత కాలం క్రితం పీసీసీ చీఫ్ పై మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో అంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ.. ఈ రోజు అమిత్ షాతో భేటీ కావడంతో.. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఢిల్లీలోనే ఉన్న శశిధర్ రెడ్డి త్వరలో అధికారక ప్రకటన చేస్తారేమో చూడాలి.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
తాజావార్తలు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..
-
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
-
OnePlus Nord CE 6: వన్ప్లస్ నార్డ్ CE6 విడుదల.. 8000mAh బ్యాటరీ, పవర్, పనితీరు అన్నీ ఒకే ఫోన్లో
-
India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?