రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మావోయిస్టు జగన్ పేరిట లేఖను అంటించడం జిల్లాలో కలకలం రేపుతోంది.
స్థానిక రేషన్ డీలర్ పేరుతో పాటు, ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచ్ పేరు, ఓబులాపూర్ లోని ఓ సామాజిక వర్గం అంశాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేసి గ్రామ పంచాయతీకి అతికించారు. తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తే మాజీ సర్పంచ్ రాజిరెడ్డికి పట్టిన గతే పడుతుందని లేఖలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం.
Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం