Site icon NTV Telugu

Maoist Narayana: లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ.. ఏపీ నక్సల్స్ ఫ్రీ స్టేట్!

Maoist Narayana

Maoist Narayana

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. దాదాపు 36 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించిన నారాయణ సహా మొత్తం 9 మంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్, ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు.

ఏపీ డీజీపీ మాట్లాడుతూ… ‘ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీ ఇప్పుడు నక్సల్స్ ఫ్రీ స్టేట్. అందరి కృషితో ఇది సాధ్యమైంది. కాల్పులు కూడా జరిగాయి, లొంగుబాట్లు కూడా జరిగాయి. మా పిలుపుకు స్పందించి 9 మంది లొంగిపోయారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సదుపాయాలు అందిస్తాము. చెన్నూరు నారాయణకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. మిగతా వారికి 24.20 లక్షలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మావోయిస్టు అగ్రనేత గణపతి కార్యకలాపాలు కూడా రాష్ట్రంలో లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు మరింత బలపడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.

లొంగిపోయిన మావోయిస్టులు:
1.చెన్నూరు నారాయణ, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు
2.కర్తం లచ్చు, కంపెనీ పార్టీ కమాండర్
3.పోడియం రాజే, ఏరియా కమిటీ సభ్యురాలు
4.కర్తం ఆడమే, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు
5.ముచిక మాస, ఏరియా కమిటీ మెంబర్
6.మాదవి జోగి, ప్లటూన్ పార్టీ కమిటీ మెంబర్
7.ముచిక లక్ష్మణ్, పార్టీ కమిటీ మెంబర్
8.మడవ ఆడమ, పార్టీ కమిటీ మెంబర్
9.కడితి హుర్రే, గచిరోలి పార్టీ మెంబర్

Exit mobile version