Manohar Rao: పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచలేదు: పీవీ సోదరుడు
- పీవీ అంత్యక్రియలపై స్పందించిన సోదరుడు
- కాంగ్రెస్ కనీస మర్యాద కూడా ఇవ్వలేదని మండిపాటు
- భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచలేదని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. స్మారక చిహ్నం నిర్మిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, సోనియా గాంధీ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చి మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. కుటుంబీకులు అంగీకరించారు. కానీ.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక స్మారకాన్ని నిర్మించలేదని గుర్తు చేశారు. భారతరత్న కూడా ఇవ్వలేదన్నారు. కనీసం పీవీ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉంచడానికి అనుమతించలేదని తెలిపారు.
READ MORE: Manmohan Singh Cremation: పీవీకి మీరు చేసింది ఏమిటి..? కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు..
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
మన్మోహన్ సింగ్ మృతి పట్ల మనోహర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ” ఆయన పదేళ్లపాటు ప్రధానిగా ఉన్నారు. అంతకు ముందు పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అప్పట్లో పీవీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. ఆ కాలంలో మన్మోహన్ సింగ్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్.. గురు-శిష్యుల వలె పనిచేశారు. అప్పటి రాజకీయాలకు ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ప్రస్తుతం దేశ విదేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పాలసీ రాలేదు. మన్మోహన్ సింగ్తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు కలిసి మాట్లాడాం. వారితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన 10 సంవత్సరాలు ప్రధాని పనిచేసినా.. ఏమీ సంపాదించులేన్నారు. మన్మోహన్ సింగ్ స్వతంత్రంగా పని చేయలేకపోయారు.” అని తెలిపారు.
READ MORE: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు
#WATCH | Hyderabad | On the issue of allocating space for a memorial for former PM #DrManmohanSingh, brother of former PM PV Narasimha Rao, Manohar Rao says, "…Congress needs to look back 20 years on how much respect they gave to their leader PV Narasimha Rao… Even Sonia… pic.twitter.com/N5q12IYDRH
— ANI (@ANI) December 29, 2024
తాజావార్తలు
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!