Manipur : మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. మాజీ ఎమ్మెల్యే భార్య, ఎన్ కౌంటర్లో మరో నలుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్లో ఆదివారం మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎన్కౌంటర్.. మరొక పేలుడు సంభవించాయి. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ (యుకెఎల్ఎఫ్) ఉగ్రవాదులకు, గ్రామస్తులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భారీ కాల్పులు జరగ్గా, నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక యూకేఎల్ ఎఫ్ మిలిటెంట్, ముగ్గురు గ్రామ వాలంటీర్లు ఉన్నారు. మృతులంతా ఒకే వర్గానికి చెందినవారు. సంఘటన తర్వాత కుకీ తెగ సభ్యులు తమ సంఘం సభ్యుల మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకీ కమ్యూనిటీ మద్దతుదారులు యూకేఎల్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎస్ హాకిప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
Read Also:Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
Also Read
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
పేలుడులో మాజీ ఎమ్మెల్యే భార్య మృతి
ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మణిపూర్లోని కాంగ్పోక్పీ జిల్లాలోని తమ నివాసంలో జరిగిన బాంబు పేలుడులో సైకుల్ మాజీ ఎమ్మెల్యే యమ్థాంగ్ హౌకిప్ భార్య చారుబాలా హౌకిప్ మరణించారు. చారుబాలా హాకిప్ (59), మెయిటీ కమ్యూనిటీ సభ్యుడు, కుకీ-జోమి ఆధిపత్యం ఉన్న కాంగ్పోక్పి జిల్లాలోని ఎకౌ ములామ్లో నివసించారు. ఆమె భర్త యమ్థాంగ్ హౌకిప్ 2012-2017లో కాంగ్రెస్ పార్టీ తరఫున సైకుల్ స్థానం నుండి ఎన్నికయ్యారు. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని, అయితే మరుసటి ఆదివారం ఉదయం నివేదించామని కాంగ్పోక్పి జిల్లాకు చెందిన పోలీసు అధికారి తెలిపారు.
Read Also:Fighter Jets: LCA మార్క్ 2 యుద్ధ విమానాలపై కీలక అప్డేట్.. అప్పుడే గాల్లోకి..!
ఎల్ఈడీ పేలుడు కారణంగా మరణం
ఇంట్లోని చెత్తలో ఐఈడీని దాచి ఉంచినట్లు వెల్లడించారు. పరికరాన్ని చెత్తలో కాల్చే సమయంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కుటుంబ కలహాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన మేనమామ మనవడి ఆస్థి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేయడం వల్లే ఈ వివాదం తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన ఆ వివాదానికి సంబంధించినది కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనలు మణిపూర్లో ఇంఫాల్ లోయలోని మెయిటీ కమ్యూనిటీ… కొండ ప్రాంతాలలోని కుకీ కమ్యూనిటీ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను పెంచాయి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!