Manipur : మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. మాజీ ఎమ్మెల్యే భార్య, ఎన్ కౌంటర్లో మరో నలుగురి మృతి
Manipur : మణిపూర్లో ఆదివారం మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎన్కౌంటర్.. మరొక పేలుడు సంభవించాయి. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ (యుకెఎల్ఎఫ్) ఉగ్రవాదులకు, గ్రామస్తులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భారీ కాల్పులు జరగ్గా, నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక యూకేఎల్ ఎఫ్ మిలిటెంట్, ముగ్గురు గ్రామ వాలంటీర్లు ఉన్నారు. మృతులంతా ఒకే వర్గానికి చెందినవారు. సంఘటన తర్వాత కుకీ తెగ సభ్యులు తమ సంఘం సభ్యుల మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకీ కమ్యూనిటీ మద్దతుదారులు యూకేఎల్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎస్ హాకిప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
Read Also:Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
పేలుడులో మాజీ ఎమ్మెల్యే భార్య మృతి
ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మణిపూర్లోని కాంగ్పోక్పీ జిల్లాలోని తమ నివాసంలో జరిగిన బాంబు పేలుడులో సైకుల్ మాజీ ఎమ్మెల్యే యమ్థాంగ్ హౌకిప్ భార్య చారుబాలా హౌకిప్ మరణించారు. చారుబాలా హాకిప్ (59), మెయిటీ కమ్యూనిటీ సభ్యుడు, కుకీ-జోమి ఆధిపత్యం ఉన్న కాంగ్పోక్పి జిల్లాలోని ఎకౌ ములామ్లో నివసించారు. ఆమె భర్త యమ్థాంగ్ హౌకిప్ 2012-2017లో కాంగ్రెస్ పార్టీ తరఫున సైకుల్ స్థానం నుండి ఎన్నికయ్యారు. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని, అయితే మరుసటి ఆదివారం ఉదయం నివేదించామని కాంగ్పోక్పి జిల్లాకు చెందిన పోలీసు అధికారి తెలిపారు.
Read Also:Fighter Jets: LCA మార్క్ 2 యుద్ధ విమానాలపై కీలక అప్డేట్.. అప్పుడే గాల్లోకి..!
ఎల్ఈడీ పేలుడు కారణంగా మరణం
ఇంట్లోని చెత్తలో ఐఈడీని దాచి ఉంచినట్లు వెల్లడించారు. పరికరాన్ని చెత్తలో కాల్చే సమయంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కుటుంబ కలహాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన మేనమామ మనవడి ఆస్థి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేయడం వల్లే ఈ వివాదం తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన ఆ వివాదానికి సంబంధించినది కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనలు మణిపూర్లో ఇంఫాల్ లోయలోని మెయిటీ కమ్యూనిటీ… కొండ ప్రాంతాలలోని కుకీ కమ్యూనిటీ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను పెంచాయి.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!