Manipur : మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. మాజీ ఎమ్మెల్యే భార్య, ఎన్ కౌంటర్లో మరో నలుగురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్లో ఆదివారం మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎన్కౌంటర్.. మరొక పేలుడు సంభవించాయి. మణిపూర్లోని తెంగ్నౌపాల్ జిల్లాలో యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ (యుకెఎల్ఎఫ్) ఉగ్రవాదులకు, గ్రామస్తులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భారీ కాల్పులు జరగ్గా, నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఒక యూకేఎల్ ఎఫ్ మిలిటెంట్, ముగ్గురు గ్రామ వాలంటీర్లు ఉన్నారు. మృతులంతా ఒకే వర్గానికి చెందినవారు. సంఘటన తర్వాత కుకీ తెగ సభ్యులు తమ సంఘం సభ్యుల మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకీ కమ్యూనిటీ మద్దతుదారులు యూకేఎల్ఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎస్ హాకిప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు.
Read Also:Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
పేలుడులో మాజీ ఎమ్మెల్యే భార్య మృతి
ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మణిపూర్లోని కాంగ్పోక్పీ జిల్లాలోని తమ నివాసంలో జరిగిన బాంబు పేలుడులో సైకుల్ మాజీ ఎమ్మెల్యే యమ్థాంగ్ హౌకిప్ భార్య చారుబాలా హౌకిప్ మరణించారు. చారుబాలా హాకిప్ (59), మెయిటీ కమ్యూనిటీ సభ్యుడు, కుకీ-జోమి ఆధిపత్యం ఉన్న కాంగ్పోక్పి జిల్లాలోని ఎకౌ ములామ్లో నివసించారు. ఆమె భర్త యమ్థాంగ్ హౌకిప్ 2012-2017లో కాంగ్రెస్ పార్టీ తరఫున సైకుల్ స్థానం నుండి ఎన్నికయ్యారు. తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిందని, అయితే మరుసటి ఆదివారం ఉదయం నివేదించామని కాంగ్పోక్పి జిల్లాకు చెందిన పోలీసు అధికారి తెలిపారు.
Read Also:Fighter Jets: LCA మార్క్ 2 యుద్ధ విమానాలపై కీలక అప్డేట్.. అప్పుడే గాల్లోకి..!
ఎల్ఈడీ పేలుడు కారణంగా మరణం
ఇంట్లోని చెత్తలో ఐఈడీని దాచి ఉంచినట్లు వెల్లడించారు. పరికరాన్ని చెత్తలో కాల్చే సమయంలో పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం ఉదయం వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కుటుంబ కలహాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తన మేనమామ మనవడి ఆస్థి పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేయడం వల్లే ఈ వివాదం తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన ఆ వివాదానికి సంబంధించినది కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనలు మణిపూర్లో ఇంఫాల్ లోయలోని మెయిటీ కమ్యూనిటీ… కొండ ప్రాంతాలలోని కుకీ కమ్యూనిటీ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను పెంచాయి.
తాజావార్తలు
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!