Manipur: రైతుల రక్షణ కోసం వీఐపీల భద్రత తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు వీఐపీ భద్రతను తగ్గించింది. ఈ 2,000 మంది భద్రతా సిబ్బందిని ఇప్పుడు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాగులో నిమగ్నమై ఉన్న రైతులకు రక్షణగా నియమించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పంటల సీజన్ను ప్రారంభించే రైతులకు భద్రత కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
Also Read: Sanjay Raut: రానున్న రోజుల్లో మహారాష్ట్ర సీఎం మారవచ్చు..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
“చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు, సివిల్ సర్వెంట్లు, మాజీ బ్యూరోక్రాట్ల భద్రత తగ్గించబడింది. ఇది సుమారు 2,000 మంది భద్రతా సిబ్బంది రైతులకు రక్షణ కల్పించేందుకు దారితీసింది. మణిపూర్లోని సమస్యాత్మక ప్రాంతాలలో సాగులో నిమగ్నమై ఉన్న రైతులకు రక్షణగా సిబ్బంది ఉంటారు.” అని ప్రకటన ద్వారా తెలిసింది. సోమవారం ఏకీకృత కమాండ్ సమావేశానికి అధ్యక్షత వహించిన తరువాత, పంటల సీజన్ను ప్రారంభించే రైతులకు భద్రత కల్పించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం బీరెన్ సింగ్ చెప్పారు. వ్యవసాయ ప్రయోజనాల కోసం, ఐదు జిల్లాల్లో ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్పోక్పి, చురచంద్పూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ మరియు కక్చింగ్ జిల్లాల్లో సుమారు 2,000 మంది అదనపు భద్రతా సిబ్బందిని మోహరిస్తామని ఆయన చెప్పారు.
Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ
భద్రతా కారణాల దృష్ట్యా ఇంఫాల్ లోయ కొండలతో కలిసిపోయే ప్రాంతాలతో పాటు రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నారనే ఆందోళనలు ఉన్నాయి. మెయిటీలు లోయలో, కుకీలు కొండలలో నివసిస్తున్నారు. రెండు కమ్యూనిటీలు జాతుల వారీగా తీవ్రంగా విభజించబడ్డాయి, ఇది గత రెండు నెలల్లో అనేక హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత వాతావరణాన్ని దెబ్బతీసే పుకార్లను నిరోధించడానికి మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం మరింత పొడిగించబడింది. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మణిపూర్లో జాతి హింస చెలరేగడంతో దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి, ఈశాన్య రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి తన ప్రయత్నాలలో ప్రజలను కలిశారు. హింసను నియంత్రించడానికి, రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి మణిపూర్ పోలీసులతో పాటు దాదాపు 40,000 మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?