SSC Exams : ఎగ్జామ్ సెంటర్ కు గంట ఆలస్యంగా క్వశ్చన్ పేపర్.. ఎక్కడంటే..?
- పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఆలస్యానికి కారణమేంటి?
- విద్యార్థులకు అదనపు సమయం ఇచ్చిన జిల్లా కలెక్టర్
- పరీక్ష నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దే చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC Exams : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం ఆలస్యంగా చేరడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఇంకా ప్రశ్నపత్రం రాకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా అన్ని పరీక్షా కేంద్రాలకు సమయానికి ప్రశ్నపత్రాలను పంపిణీ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, బాయ్స్ హైస్కూల్కు ప్రశ్నపత్రం చేరేందుకు గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ ఆలస్యంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు సూచించిన కలెక్టర్, విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. “ఎంత సమయం ఆలస్యం అయిందో, అంత సమయం విద్యార్థులకు అదనంగా ఇస్తాం” అని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
జిల్లా విద్యాశాఖాధికారి (D.E.O) పై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించిన కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష ప్రారంభ సమయంలో ప్రశ్నపత్రం అందుబాటులో లేకపోవడం విద్యార్థులకు మానసిక ఒత్తిడిని కలిగించింది. అయితే, కలెక్టర్ నిర్ణయం వారికి కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రశ్నపత్రం ఆలస్యం అవ్వడం విద్యా శాఖలో సమర్థవంతమైన నిర్వహణపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమయపాలన విషయంలో మరింత జాగ్రత్త వహించాలని విద్యాశాఖను కోరుతున్నారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?