NTV Telugu Site icon

MP: ఘోరం.. మాట్లాడలేదని బాలికను చంపిన యువకుడు

Crt

Crt

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పరిచయం ఉన్న బాలిక మాట్లాడేందుకు నిరాకరించిందని యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..

తమన్నా అనే బాలిక(17)తో గుఫ్రాన్ (20) అనే యువకుడికి పరిచయం ఉంది. పరిచయం మీద తనతో మాట్లాడాలని  ఒత్తిడి చేస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతడ్ని దూరం పెట్టింది. దీన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్నాడు. సోమవారం బయటకు వచ్చిన బాలికను గుఫ్రాన్ అడ్డుకుని బహిరంగంగా కత్తితో పొడిచాడు. స్థానికులు బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Physical Harrasment: దారుణం.. తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించిన భర్త

బాలిక మాట్లాడేందుకు నిరాకరించినందుకే యువకుడు కత్తితో పొడిచినట్లుగా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ రాథోడ్ తెలిపారు. నిందితుడితో బాలికకు పరిచయం ఉందని, ఇటీవల అతనితో మాట్లాడటం మానేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారి తెలిపారు. దాడి అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోతుండగా బాటసారులు పట్టుకునేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపించింది.

ఇది కూడా చదవండి: PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..