Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Partner: ఢిల్లీ శివారు నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పరుపులోని నింపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. నలసోపరాలోని నివాసంలో తన 35 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్ఘర్ జిల్లాలోని తులింజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హార్దిక్ షా మేఘా ధన్ సింగ్ తోర్వితో కలిసి నలసోపరాలోని సీతా సదన్ సొసైటీలో నివాసం ఉన్నాడు. ఈ జంట తమ రియల్ ఎస్టేట్ ఏజెంట్, యజమాని, ఇతర పొరుగువారికి తాము వివాహం చేసుకున్నట్లు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. నలసోపరాలోని విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ నుంచి కుళ్లిపోయిన మేఘా మృతదేహాన్ని వెలికితీయడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నిందితుడు పరుపులో పెట్టి కుట్టేశాడు. ఆమె గత వారంలో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ తెలిపారు.
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
Crime News: శ్రద్ధా వాకర్ ఘటన తరహాలోనే.. పెళ్లి చేసుకోమన్నందుకు హత్య, ఫ్రిజ్లో మృతదేహం
మేఘాను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడికి ఉద్యోగం లేదని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ఒక గొడవ సమయంలో అతను ఆమెను చంపాడని ఆ అధికారి తెలిపారు. మేఘా ఎప్పుడు హత్యకు గురైందో కచ్చితమైన తేదీని నిర్ధారించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు తన సోదరికి హత్య గురించి మెసేజ్ చేసి పారిపోయే ముందు ఫ్లాట్లోని ఫర్నిచర్ను విక్రయించాడు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.
ఢిల్లీ నజాఫ్గఢ్ హత్య
ఢిల్లీలోని నజాఫ్గఢ్లో 22 ఏళ్ల నిక్కీ యాదవ్ హత్య దేశాన్ని కుదిపేసిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలోని ధాబాలో తన 22 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్లో భద్రపరచినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మృతురాలు నిక్కీ యాదవ్గా గుర్తించబడింది. ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీ సమీపంలో ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ (24) గొంతు కోసి చంపాడు. నిందితుడు తన మొబైల్ డేటా కేబుల్ను ఉపయోగించాడని ఆరోపించారు. తన కారులో మహిళను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఘటనే గతేడాది దిల్లీలో జరిగింది. అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
తాజావార్తలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!