Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Partner: ఢిల్లీ శివారు నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పరుపులోని నింపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. నలసోపరాలోని నివాసంలో తన 35 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్ఘర్ జిల్లాలోని తులింజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హార్దిక్ షా మేఘా ధన్ సింగ్ తోర్వితో కలిసి నలసోపరాలోని సీతా సదన్ సొసైటీలో నివాసం ఉన్నాడు. ఈ జంట తమ రియల్ ఎస్టేట్ ఏజెంట్, యజమాని, ఇతర పొరుగువారికి తాము వివాహం చేసుకున్నట్లు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. నలసోపరాలోని విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ నుంచి కుళ్లిపోయిన మేఘా మృతదేహాన్ని వెలికితీయడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నిందితుడు పరుపులో పెట్టి కుట్టేశాడు. ఆమె గత వారంలో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ తెలిపారు.
Also Read
Crime News: శ్రద్ధా వాకర్ ఘటన తరహాలోనే.. పెళ్లి చేసుకోమన్నందుకు హత్య, ఫ్రిజ్లో మృతదేహం
మేఘాను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడికి ఉద్యోగం లేదని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ఒక గొడవ సమయంలో అతను ఆమెను చంపాడని ఆ అధికారి తెలిపారు. మేఘా ఎప్పుడు హత్యకు గురైందో కచ్చితమైన తేదీని నిర్ధారించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు తన సోదరికి హత్య గురించి మెసేజ్ చేసి పారిపోయే ముందు ఫ్లాట్లోని ఫర్నిచర్ను విక్రయించాడు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.
ఢిల్లీ నజాఫ్గఢ్ హత్య
ఢిల్లీలోని నజాఫ్గఢ్లో 22 ఏళ్ల నిక్కీ యాదవ్ హత్య దేశాన్ని కుదిపేసిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలోని ధాబాలో తన 22 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్లో భద్రపరచినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మృతురాలు నిక్కీ యాదవ్గా గుర్తించబడింది. ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీ సమీపంలో ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ (24) గొంతు కోసి చంపాడు. నిందితుడు తన మొబైల్ డేటా కేబుల్ను ఉపయోగించాడని ఆరోపించారు. తన కారులో మహిళను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఘటనే గతేడాది దిల్లీలో జరిగింది. అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
తాజావార్తలు
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!