Man Kills Partner: ప్రియురాలిని హత్య చేసి పరుపులో మూటకట్టేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Partner: ఢిల్లీ శివారు నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలో ఉన్న తన ధాబాలో తన సహజీవన భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో నింపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మహారాష్ట్రలో కూడా మరో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని పరుపులోని నింపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. నలసోపరాలోని నివాసంలో తన 35 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసినందుకు 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాల్ఘర్ జిల్లాలోని తులింజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హార్దిక్ షా మేఘా ధన్ సింగ్ తోర్వితో కలిసి నలసోపరాలోని సీతా సదన్ సొసైటీలో నివాసం ఉన్నాడు. ఈ జంట తమ రియల్ ఎస్టేట్ ఏజెంట్, యజమాని, ఇతర పొరుగువారికి తాము వివాహం చేసుకున్నట్లు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. నలసోపరాలోని విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ నుంచి కుళ్లిపోయిన మేఘా మృతదేహాన్ని వెలికితీయడంతో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నిందితుడు పరుపులో పెట్టి కుట్టేశాడు. ఆమె గత వారంలో హత్యకు గురై ఉంటుందని అనుమానిస్తున్నట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర నాగర్కర్ తెలిపారు.
Also Read
- Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
Crime News: శ్రద్ధా వాకర్ ఘటన తరహాలోనే.. పెళ్లి చేసుకోమన్నందుకు హత్య, ఫ్రిజ్లో మృతదేహం
మేఘాను హత్య చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడికి ఉద్యోగం లేదని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాంటి ఒక గొడవ సమయంలో అతను ఆమెను చంపాడని ఆ అధికారి తెలిపారు. మేఘా ఎప్పుడు హత్యకు గురైందో కచ్చితమైన తేదీని నిర్ధారించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిందితుడు తన సోదరికి హత్య గురించి మెసేజ్ చేసి పారిపోయే ముందు ఫ్లాట్లోని ఫర్నిచర్ను విక్రయించాడు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఒక అధికారి తెలిపారు.
ఢిల్లీ నజాఫ్గఢ్ హత్య
ఢిల్లీలోని నజాఫ్గఢ్లో 22 ఏళ్ల నిక్కీ యాదవ్ హత్య దేశాన్ని కుదిపేసిన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నజాఫ్గఢ్లోని మిత్రోన్ గ్రామ శివార్లలోని ధాబాలో తన 22 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్లో భద్రపరచినందుకు ఢిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మృతురాలు నిక్కీ యాదవ్గా గుర్తించబడింది. ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీ సమీపంలో ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ (24) గొంతు కోసి చంపాడు. నిందితుడు తన మొబైల్ డేటా కేబుల్ను ఉపయోగించాడని ఆరోపించారు. తన కారులో మహిళను గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఘటనే గతేడాది దిల్లీలో జరిగింది. అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!