Uttarpradesh : క్రికెట్ మ్యాచ్లో గొడవ.. ముగ్గురు కలిసి రాయితో మోది ఒకరి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఓ చిన్నవిషయానికి గొడవపడి 24 ఏళ్ల యువకుడిని రాయితో కొట్టి చంపారు. ఆదివారం నోయిడా ఎక్స్టెన్షన్లోని చిపియానా గ్రామం సమీపంలో కొందరు వ్యక్తులు క్రికెట్ ఆడటానికి వెళ్లారు. మ్యాచ్ ఆడుతుండగా వారి మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు 24 ఏళ్ల సుమిత్ను హత్య చేశారు. సుమిత్ కుటుంబ సభ్యులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మ్యాచ్ వివాదంలో ఘర్షణ కారణంగా హత్య కేసుగా గుర్తించారు. ఈ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మృతి చెందిన సుమిత్కు, మరికొంతమందికి మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారు సుమిత్ తలపై రాళ్లతో కొట్టడం కొనసాగించారు.
Read Also:Vishwambhara: విశ్వంభర షూట్ లో జాయినైన త్రిష…
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
మధ్యాహ్నం చిపియానా గ్రామ సమీపంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిర్దేష్ కతేరియా తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడికి పాల్పడిన వారి నుంచి తప్పించుకునేందుకు సుమిత్ ప్రయత్నించాడు. ఆ తర్వాత కూడా నిందితులు అతడిని వదలకుండా ముగ్గురూ మళ్లీ అతడిపై దాడి చేసి తలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో అతను డ్రైనేజీలో పడిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. సుమిత్ కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందిందని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ప్రధాన నిందితుడు హిమాన్షుతో పాటు మరో ఇద్దరిపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.
Read Also:IND vs ENG: 45 ఏళ్ల రికార్డు బద్దలు.. దిగ్గజాలను అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్!
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!