Uttarpradesh : క్రికెట్ మ్యాచ్లో గొడవ.. ముగ్గురు కలిసి రాయితో మోది ఒకరి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఓ చిన్నవిషయానికి గొడవపడి 24 ఏళ్ల యువకుడిని రాయితో కొట్టి చంపారు. ఆదివారం నోయిడా ఎక్స్టెన్షన్లోని చిపియానా గ్రామం సమీపంలో కొందరు వ్యక్తులు క్రికెట్ ఆడటానికి వెళ్లారు. మ్యాచ్ ఆడుతుండగా వారి మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు 24 ఏళ్ల సుమిత్ను హత్య చేశారు. సుమిత్ కుటుంబ సభ్యులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మ్యాచ్ వివాదంలో ఘర్షణ కారణంగా హత్య కేసుగా గుర్తించారు. ఈ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మృతి చెందిన సుమిత్కు, మరికొంతమందికి మధ్య ఏదో విషయమై వాగ్వాదం జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారు సుమిత్ తలపై రాళ్లతో కొట్టడం కొనసాగించారు.
Read Also:Vishwambhara: విశ్వంభర షూట్ లో జాయినైన త్రిష…
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
మధ్యాహ్నం చిపియానా గ్రామ సమీపంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిర్దేష్ కతేరియా తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడికి పాల్పడిన వారి నుంచి తప్పించుకునేందుకు సుమిత్ ప్రయత్నించాడు. ఆ తర్వాత కూడా నిందితులు అతడిని వదలకుండా ముగ్గురూ మళ్లీ అతడిపై దాడి చేసి తలపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో అతను డ్రైనేజీలో పడిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. సుమిత్ కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందిందని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ప్రధాన నిందితుడు హిమాన్షుతో పాటు మరో ఇద్దరిపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.
Read Also:IND vs ENG: 45 ఏళ్ల రికార్డు బద్దలు.. దిగ్గజాలను అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్!
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!