Mallu Ravi : ముప్పై రోజుల పాలన ప్రజారంజకంగా సాగింది…
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను ఈయాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకెళతున్నారని ఆయన తెలిపారు. పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, ముప్పై రోజుల పాలన ప్రజారాంజకంగా సాగిందన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమి ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
కొల్లాపూర్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం తో అబద్దాలు మాట్లాడిండని, వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తుండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని ప్రచారం చేస్తుండ్రు అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలువనుందని ఇలాంటి ప్రచారం చేస్తుండ్రు అని ఆయన తెలిపారు. రామ మందిరం బీజేపీ పార్టీ కార్యక్రమంలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, రాముడు అందరివాడు.. కాంగ్రెస్ రామరాజ్యం లక్ష్యం గా పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిరా నుండి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తుందని, రామ మందిర ప్రారంభం ఆహ్వానం ఉన్నా ట్రస్ట్ తో సంబంధం లేకుండా బిజెపి తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే వెళ్లలేక పోతున్నామని, రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!