Mallu Ravi : ముప్పై రోజుల పాలన ప్రజారంజకంగా సాగింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ దేశాన్ని ఏక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారన్నారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్ లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేసుకున్నారన్నారు మల్లు రవి. అంతేకాకుండా.. ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను ఈయాత్ర ద్వారా ప్రజలలోకి తీసుకెళతున్నారని ఆయన తెలిపారు. పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లారని, ముప్పై రోజుల పాలన ప్రజారాంజకంగా సాగిందన్నారు. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్దంగా ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమి ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కొల్లాపూర్ లో కేటీఆర్ తప్పుడు సమాచారం తో అబద్దాలు మాట్లాడిండని, వ్యక్తిగత గొడవల వల్ల జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తుండ్రు అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ పార్లమెంటు ఎన్నికల తర్వాత కూలిపోతుందని ప్రచారం చేస్తుండ్రు అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలువనుందని ఇలాంటి ప్రచారం చేస్తుండ్రు అని ఆయన తెలిపారు. రామ మందిరం బీజేపీ పార్టీ కార్యక్రమంలాగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, రాముడు అందరివాడు.. కాంగ్రెస్ రామరాజ్యం లక్ష్యం గా పని చేస్తుందన్నారు. గాంధీ, ఇందిరా నుండి నేటి వరకు కాంగ్రెస్ ఆలోచనా విధానంతో ముందుకెళ్తుందని, రామ మందిర ప్రారంభం ఆహ్వానం ఉన్నా ట్రస్ట్ తో సంబంధం లేకుండా బిజెపి తన పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందునే వెళ్లలేక పోతున్నామని, రామ మందిరాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!