సోనియాగాంధీకి రోశయ్య అత్యంత ఆప్తుడని… రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కాసేపటి క్రితమే రోశయ్య పార్థివదేహానికి మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. రోశయ్యతో నాకు మంచి సాన్నిహిత్యం ఉందని… కాంగ్రెస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి అనేక పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు.
రోశయ్యకి నివాళి అర్పించడం కోసం ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ నన్ను ఇక్కడికి పంపించారన్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకుడు రోశయ్య అని… అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని తెలిపారు. భారతదేశంలో ఆర్ధికమంత్రి పదవికి వన్నెతెచ్చిన నాయకుడు రోశయ్య అని… ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు మల్లికార్జున ఖర్గే.