Maldives President: భారత్ సైన్యాన్ని తొలగించకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు. భారత సైన్యం మాల్దీవుల్లోనే కొనసాగితే మాల్దీవుల ప్రజల ‘ప్రజాస్వామ్య సంకల్పాన్ని’ విస్మరించినట్లేనని ఆయన పేర్కొన్నారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం యొక్క కార్యాచరణను పెంపొందించే ప్రయత్నాలతో సహా భారతదేశంతో రక్షణ సహకారానికి ఆయన మద్దతు ఇచ్చారు. మాల్దీవులలో భారతదేశం యొక్క శాశ్వత సైనిక ఉనికిని మహమ్మద్ ముయిజ్జూ తిరస్కరించాడు.
Read Also: Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!
Also Read
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
భారతదేశంతో మల్దీవులు పరస్పర చర్చల ద్వారా సైనిక ఉనికి సమస్యను పరిష్కరించుకుంటామని మయిజ్జూ తెలిపారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా విదేశీ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉండటం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. మాల్దీవులకు అనుకూల విధానాన్ని మాత్రమే తాము అనుసరిస్తున్నట్లు చెప్పాడు.. భారత్కు వెళ్లే ముందు చైనాను సందర్శించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Read Also: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు: సిరాజ్
మేము ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉండము అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తెలిపారు. మాల్దీవుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రో-మాల్దీవుల విధానాన్ని మార్గనిర్దేశం చేసే సూత్రం అని ఆయన అన్నారు.. శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 77 మంది భారతీయ సైనికులు మాల్దీవులలో మోహరించారు. వీరిలో 24 మంది హెలికాప్టర్ల నిర్వహణకు, 25 మంది డోర్నియర్ విమానాల నిర్వహణకు, 26 మంది ఇతర హెలికాప్టర్ల నిర్వహణకు వినియోగించారు. వీరే కాకుండా మెయింటెనెన్స్ తో పాటు ఇంజినీరింగ్ కోసం మరో ఇద్దరు భారతీయ సైనికులు ఉన్నారు. సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముయిజ్జూ భారతీయ సైనికులను వెనక్కి పంపాలని ప్రకటించారు.
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!