Maldives: మాల్దీవులు కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్ పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని ఆ దేశ హోం మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లకుండా ఉండాలని ఇజ్రాయెల్ తన పౌరులకు కూడా సూచించింది.
Read Also: Pakistan Army: చరిత్ర సృష్టించిన క్రైస్తవ మహిళ.. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ
Also Read
- Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
మాల్దీవుల హోం వ్యవహారాలు, సాంకేతిక మంత్రి అలీ ఇహ్సాన్ ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. క్యాబినెట్ సిఫారసు మేరకు ఇజ్రాయెల్ పాస్పోర్ట్ హోల్డర్లు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించడాన్ని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆమోదించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది. పాలస్తీనియన్ల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించాలని మహమ్మద్ ముయిజ్జు నిర్ణయించారు. పాలస్తీనా ప్రజలకు సహాయం చేసేందుకు నిధులను సేకరించే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ సహాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మాల్దీవులు ఈ చర్య తీసుకుంది.
Read Also: Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి, 800 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను చంపి, 240 మందిని బందీలుగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్లోని గాజా స్ట్రిప్ ప్రాంతంలో భీకర యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మందికి పైగా మరణించారు. ప్రతి సంవత్సరం సుమారు 15 వేల మంది ఇజ్రాయెలీలు పర్యాటకులుగా మాల్దీవులకు వస్తారు. కానీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాల్దీవులు తీసుకున్న ఈ చర్య తర్వాత, ఇజ్రాయెల్ సర్కారు కూడా తమ పౌరులను మాల్దీవులకు వెళ్లకుండా ఉండమని కోరింది.
తాజావార్తలు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!