Maldives: మాల్దీవులు కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్ పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని ఆ దేశ హోం మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లకుండా ఉండాలని ఇజ్రాయెల్ తన పౌరులకు కూడా సూచించింది.
Read Also: Pakistan Army: చరిత్ర సృష్టించిన క్రైస్తవ మహిళ.. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ
Also Read
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
మాల్దీవుల హోం వ్యవహారాలు, సాంకేతిక మంత్రి అలీ ఇహ్సాన్ ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. క్యాబినెట్ సిఫారసు మేరకు ఇజ్రాయెల్ పాస్పోర్ట్ హోల్డర్లు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించడాన్ని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆమోదించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది. పాలస్తీనియన్ల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించాలని మహమ్మద్ ముయిజ్జు నిర్ణయించారు. పాలస్తీనా ప్రజలకు సహాయం చేసేందుకు నిధులను సేకరించే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ సహాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మాల్దీవులు ఈ చర్య తీసుకుంది.
Read Also: Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి, 800 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను చంపి, 240 మందిని బందీలుగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్లోని గాజా స్ట్రిప్ ప్రాంతంలో భీకర యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మందికి పైగా మరణించారు. ప్రతి సంవత్సరం సుమారు 15 వేల మంది ఇజ్రాయెలీలు పర్యాటకులుగా మాల్దీవులకు వస్తారు. కానీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాల్దీవులు తీసుకున్న ఈ చర్య తర్వాత, ఇజ్రాయెల్ సర్కారు కూడా తమ పౌరులను మాల్దీవులకు వెళ్లకుండా ఉండమని కోరింది.
తాజావార్తలు
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!