Plane Crash: మలావీ వైస్ ప్రెసిడెంట్తో సహా మరో 9 మంది మృతి
- మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా దుర్మరణం
- మలావీ వైస్ ప్రెసిడెంట్తో సహా మరో 9 మంది మృతి
- అధికారికంగా ధృవీకరించిన మలావీ అధ్యక్షుడు లాజరస్
- ప్రతికూల వాతావరణమే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా మీడియాకు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం దట్టమైన అడవిలో కూలిపోయిందని.. ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పేర్కొన్నారు. ఈ విషాదకర వార్త తెలియజేయడానికి బాధపడుతున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు.

Also Read
ఉపాధ్యక్షుడు చిలిమా(51) సహా మరో తొమ్మిది మంది సైనిక విమానంలో ప్రయాణిస్తుండగా సోమవారం అదృశ్యమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఉత్తర నగరమైన జుజులో ల్యాండ్ కావడం విఫలమైంది. దీంతో రాజధాని లిలాంగ్వేకి తిరిగి రావాలని సందేశం అందింది. కానీ తిరిగి రాకుండానే దట్టమైన అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. దీంతో అప్పట్నుంచి జల్లెడ పట్టగా.. మంగళవారం దట్టమైన అడవిలో విమానం జాడను కనుగొన్నారు. తిరిగి క్షేమంగా రావాలని అందరూ ప్రార్థించారు. కానీ చివరికి విషాదంగా ప్రయాణం ముగిసింది.
ఇది కూడా చదవండి: India-China: చైనా కవ్వింపులకు భారత్ గట్టి సమాధానం.. టిబెల్లోని 30 ప్రదేశాలకు పేర్లు మార్చనున్న భారత్..
చిలిమా ప్రయాణిస్తున్న విమానం జాడ తప్పిపోగానే మలావి పొరుగు దేశాలతో సహా ఇతర దేశాల హెలికాప్టర్లు మరియు డ్రోన్లతో సహాయ చర్యలు చేపట్టినట్లు ఆర్మీ కమాండర్ జనరల్ పాల్ వాలెంటినో ఫిరి తెలిపారు. సి-12 మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్తో సహా అందుబాటులో ఉన్న అన్ని సహాయాలను అందించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్లు లిలాంగ్వేలోని యూఎస్ ఎంబసీ తెలిపింది. అయితే సెర్చ్ టీమ్ సభ్యులు షేర్ చేసిన ఫుటేజ్ మంగళవారం నాడు ప్రతికూల వాతావరణం కనబడిందన్నారు. పొగమంచు కారణంగా సహాయ చర్యలకు ఆటంకం కలిగించాయని తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!